ఏపీ రాజధాని తరలింపు విషయంలో అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు, నిరసనలు ఇప్పుడు ఢిల్లీ కి చేరాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ అమరావతి రైతులు, రాజధాని జెఎసి నేతలు ఈరోజు ఢిల్లీ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ని కలిసి విన్నవించుకున్నారు. అంతేకాదు ఆందోళనకారులపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు పాల్పడుతుందని, వారిపై అక్రమ కేసులు పెడుతుందని దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలి అని కిషన్ రెడ్డిని కోరారు రాజధాని జేఏసీ నేతలు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ మూడు రాజధానుల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎటు వంటి సమాచారం లేదని, కేంద్రప్రభుత్వానికి సమాచారం అందితే ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వంతో చర్చిస్తామని చెప్పారు. రాజ్యాంగ పరిధిలోనే కేంద్ర వ్యవహరిస్తుందని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ మంచిదే కానీ, రాజధాని తరలింపు మంచిది కాదని, అయితే అది మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విషయం అన్నారు కిషన్ రెడ్డి. ఈ విషయంపై ప్రభుత్వానికి సూచనలు మాత్రం చేస్తామని చెప్పారు. మూడు రాజధానులు మంచిది కాదని బీజేపీ ఇంతకుముందే చెప్పిందని చెప్పారు కిషన్ రెడ్డి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…