ప్రస్తుత కాలంలో మన రోజువారీ ఆహార విషయంలో భాగంగా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నో రకాల సమస్యలు మనల్ని చుట్టుముట్టి వస్తున్నాయి. ప్రస్తుతం పోషకాహారం కలిగిన ఆహార పదార్థాలను దూరం పెట్టి, ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడటం వల్ల అధిక శరీర బరువు పెరుగుతున్నారు. అయితే ఈ విధమైనటువంటి ఎన్నో రకాల సమస్యలను తగ్గించుకోవడం కోసం అనేక మార్గాలు మన వంటింట్లోనే దాగి ఉన్నాయని చాలా మందికి తెలియదు.శరీర బరువును తగ్గించుకోవడం నుంచి వివిధ రకాల సమస్యలను మన ఇంట్లో లభించే ఈ సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి ఆ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.
ఈ క్రమంలోనే ఆయుర్వేదంలో ఎన్నో సంవత్సరాలుగా విరివిగా ఉపయోగిస్తున్న వాటిలో మిరియాలు ఒకటి.మిరియాలలో ఎన్నో సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు దాగి ఉన్నాయి.ప్రతిరోజు మన ఆహారంలో భాగంగా మిరియాలను తీసుకోవటంవల్ల జలుబు దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల నుంచి విముక్తి పొందడమే కాకుండా శరీర బరువును కూడా తగ్గించుకోవచ్చు.మరి శరీర బరువును తగ్గించుకోవడం కోసం మిరియాలు ఏవిధంగా దోహదపడతాయో ఇక్కడ తెలుసుకుందాం..
అధిక శరీర బరువుతో బాధపడేవారు తరచూ నాలుగైదు మిరియాలను తమలపాకులో పెట్టుకుని నమిలి మింగడం ద్వారా మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోయి బరువు తగ్గడానికి దోహదపడుతుంది. అదే విధంగా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, తేనె, ఒక టేబుల్ స్పూన్ మిరియాలపొడి కలిపి ప్రతి రోజూ ఉదయం పరగడుపున తాగడం వల్ల శరీర బరువును తగ్గించుకోవచ్చు.
మిరియాలపొడి తినలేము అని భావించేవారు మార్కెట్లో లభించే పెప్పెర్ ఆయిల్ ఉపయోగించవచ్చు.ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిలోకి రెండు చుక్కల ఆలివ్ ఆయిల్ వేసుకొని తాగినా కూడా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.అదే విధంగా ఇతర సుగంధ ద్రవ్యాలు అయినా అల్లం ,పుదీనా, లవంగాలు తులసి ఆకులతో కలిపి కషాయం తయారుచేసుకొని ,తాగినా కూడా తొందరగా శరీర బరువును తగ్గించుకోవచ్చనీ నిపుణులు చెబుతున్నారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…