ప్రస్తుత కాలంలో మన రోజువారీ ఆహార విషయంలో భాగంగా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నో రకాల సమస్యలు మనల్ని చుట్టుముట్టి వస్తున్నాయి. ప్రస్తుతం పోషకాహారం కలిగిన ఆహార పదార్థాలను దూరం పెట్టి, ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడటం వల్ల అధిక శరీర బరువు పెరుగుతున్నారు. అయితే ఈ విధమైనటువంటి ఎన్నో రకాల సమస్యలను తగ్గించుకోవడం కోసం అనేక మార్గాలు మన వంటింట్లోనే దాగి ఉన్నాయని చాలా మందికి తెలియదు.శరీర బరువును తగ్గించుకోవడం నుంచి వివిధ రకాల సమస్యలను మన ఇంట్లో లభించే ఈ సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి ఆ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.

ఈ క్రమంలోనే ఆయుర్వేదంలో ఎన్నో సంవత్సరాలుగా విరివిగా ఉపయోగిస్తున్న వాటిలో మిరియాలు ఒకటి.మిరియాలలో ఎన్నో సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు దాగి ఉన్నాయి.ప్రతిరోజు మన ఆహారంలో భాగంగా మిరియాలను తీసుకోవటంవల్ల జలుబు దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల నుంచి విముక్తి పొందడమే కాకుండా శరీర బరువును కూడా తగ్గించుకోవచ్చు.మరి శరీర బరువును తగ్గించుకోవడం కోసం మిరియాలు ఏవిధంగా దోహదపడతాయో ఇక్కడ తెలుసుకుందాం..
అధిక శరీర బరువుతో బాధపడేవారు తరచూ నాలుగైదు మిరియాలను తమలపాకులో పెట్టుకుని నమిలి మింగడం ద్వారా మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోయి బరువు తగ్గడానికి దోహదపడుతుంది. అదే విధంగా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, తేనె, ఒక టేబుల్ స్పూన్ మిరియాలపొడి కలిపి ప్రతి రోజూ ఉదయం పరగడుపున తాగడం వల్ల శరీర బరువును తగ్గించుకోవచ్చు.
మిరియాలపొడి తినలేము అని భావించేవారు మార్కెట్లో లభించే పెప్పెర్ ఆయిల్ ఉపయోగించవచ్చు.ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిలోకి రెండు చుక్కల ఆలివ్ ఆయిల్ వేసుకొని తాగినా కూడా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.అదే విధంగా ఇతర సుగంధ ద్రవ్యాలు అయినా అల్లం ,పుదీనా, లవంగాలు తులసి ఆకులతో కలిపి కషాయం తయారుచేసుకొని ,తాగినా కూడా తొందరగా శరీర బరువును తగ్గించుకోవచ్చనీ నిపుణులు చెబుతున్నారు.


































