దేశవ్యాప్తంగా కరోనా ఏ విధమైనటువంటి ప్రళయం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. కరోనా వైరస్ రోజురోజుకు వ్యాప్తి చెందడంతో ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. తాజాగా ఈ కరోనా రక్కసికి ఒక ఊరు మొత్తం ఖాళీ చేసే పరిస్థితి తీసుకు వచ్చింది. వికారాబాద్ జిల్లా ఎర్రవల్లి గ్రామంలో ఒకేసారి ఆరు వందల మంది కరోనా బారిన పడటంతో ప్రజలు ఎంతో భయాందోళన చెంది ఊరు మొత్తం ఖాళీ చేశారు.
ఎర్రవల్లి గ్రామంలో 1400మంది జనాభా ఉండగా అందులో 600 మంది కరోనా బారిన పడడంతో ప్రజలు ఎంతో ఆందోళన చెందుతున్నారు.ఈ క్రమంలోనే ఎప్పుడూ ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయి అన్న భయంతో ఆ గ్రామంలోని గ్రామస్థులందరూ ఊరు ఖాళీ చేసి తమ పొలాలలో గుడిసెలు వేసుకొని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఈ విధంగా ఊరు మొత్తం ఖాళీ చేయడంతో గ్రామ వీధిలు నిర్మానుష్యంగా మారాయి.
వారం రోజుల క్రితం ఇద్దరు కరోనా బాధితులు తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడి ప్రాణాలు కోల్పోవడంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. ఈ విధంగా ఊరు మొత్తం ఖాళీ చేసినప్పటికీ అధికారులు ఏ మాత్రం స్పందించలేదు. గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి అందరికీ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ని కోరినప్పటికీ అధికారులు ఏవిధమైన చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ గ్రామానికి ప్రతి రోజు ఒక ఏఎన్ఎం వస్తుందని గ్రామస్తులు తెలిపారు.కరోనాతో చనిపోయిన ఇద్దరు మృతదేహాలను జెసిబి సహాయంతో గోతులు తవ్వి పాతి పెట్టినట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే ఎప్పుడూ ఎవరికీ ఎటువంటి పరిస్థితులు తలెత్తుతాయనే ఆందోళనలో గ్రామస్తులు గడుపుతున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…