వివాహేతర సంబంధాలు ఎంత దూరం అయినా తీసుకెళ్తాయి. వాటి వల్ల ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. వారిని నమ్ముకున్న కుటుంబాలు రోడ్డున పడతాయి. ఇలాంటి ఘటన ఒకటి మధ్య ప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను నిలదీసిన భర్త.. ఆ భార్య మాత్రం పట్టించుకోలేదు.
దీంతో మనస్తాపానికి గురైన సదరు వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరుసటి రోజు భార్య కూడా ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ లోని భోపాల్ టీటీ నగర్ కు చెందిన గొల్లు బలన్(25), సుధా(22)లు భార్యాభర్తలు. వీరిద్దరికి ఒక బాబు కూడా ఉన్నాడు.
అయితే గొల్లు బాలన్ కు తన స్నేహితుడు సాగర్ ఉండేవాడు. అతడు తరచూ తన ఇంటికి వచ్చి సుధాతో మాట్లాడుతుండేవాడు. ఫ్రేండే కదా అని అతడు అంతగా పట్టించుకోలేదు. కానీ ఓ రోజు జరగరాని ఘటన జరిగిపోయింది. సాగర్, సుధాతో ప్రేమయాణం నడిపించాడు. ఇది గమనించిన గొల్లు బాలన్ భార్యను నిలదీశాడు. కానీ ఆమె ఏ మాత్రం పట్టించుకోలేదు.
దీంతో అతడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేనిది చూసి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత రోజు భర్త సూసైడ్ చేసుకున్నాడని తెలిసి భార్య కూడా ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో వారికి పుట్టిన నాలుగేళ్ల బిడ్డ అనాథగా మారిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్యాభర్తల చావుకు కారణమైన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అనాథ అయిన నాలుగేళ్ల కొడుకు, గొల్లు తల్లి తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…