A wife poisoned her husband out of passion for her boyfriend and killed him..
అక్రమ సంబంధాల మోజులో కట్టుకున్న భర్తలను కడతేరుస్తున్న ఘటనలు ఇటీవల కలకలం రేపుతున్నాయి. తాజాగా తెలంగాణలోని వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో అలాంటి దారుణమే ఒకటి వెలుగు చూసింది. బావపై ప్రేమతో భర్తకు విషం ఇచ్చి చంపేసిందో భార్య. కూల్డ్రింక్లో పురుగుల మందు కలిపి ఇచ్చి భర్త ప్రాణాలు తీసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ఎస్సై చందర్ వెల్లడించిన వివరాల ప్రకారం… వర్ధన్నపేట తండాకు చెందిన బాలాజీ వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య కాంతి, కుమార్తె స్వప్న, కుమారుడు ప్రవీణ్ ఉన్నారు.
కూల్డ్రింక్లో విషం కలిపి…
ఈ నెల 8వ తేదీ సాయంత్రం బాలాజీ మద్యం తాగడానికి బయటకు వెళ్తుండగా, అతని భార్య కాంతి పురుగుల మందు కలిపిన కూల్డ్రింక్ను అతనికి ఇచ్చింది. అది తాగిన కొద్దిసేపటికే బాలాజీ గొంతులో నొప్పి వస్తోందంటూ కిందపడిపోయాడు. భర్త అస్వస్థతకు గురైనప్పటికీ, కాంతి అతడిని అక్కడే వదిలేసి దగ్గర్లోని తాళ్లకుంట తండాలో ఉంటున్న తన అక్క, బావ ఇంటికి వెళ్లింది.
వైద్యం విఫలం, మృతి
కొంతసేపటికి పొరుగింటివారు బాలాజీని గుర్తించి వెంటనే వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న బాలాజీ ఆరోగ్యం మరింత విషమించడంతో హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జూలై 15న బాలాజీ మృతి చెందాడు.
తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు
మృతుడి తండ్రి హరిచందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడు బాలాజీని అతని భార్య కాంతి, బావతో ఉన్న అక్రమ సంబంధం కారణంగానే చంపిందని ఆరోపించారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయని ఎస్సై చందర్ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…