Actor Sivaji Raja : తెలుగు సినిమాల్లో విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా పలు పాత్రల్లో నటించి మెప్పించిన వ్యక్తి శివాజీ రాజా ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాత్రలను చేస్తూ ప్రేక్షకులలో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. శివాజీ రాజా దాదాపు 400 సినిమాల్లో నటించారు. ఇక బుల్లితెర మీద పలు సీరియల్స్ లో కూడా నటించిన అయన అమృతం, ఆలస్యం అమృతం, పండు మిరపకాయ్, పాపం పద్మనాభం వంటి సీరియల్స్ తో బుల్లితెర మీద కూడా మంచి హిట్స్ అందుకున్నాడు. ఇక ఇండస్ట్రీలో ఎవరు ఎలా స్పందిస్తారో, అలానే మా అసోసియేషన్ లో జరిగే విషయాల గురించి మాట్లాడారు శివాజీ రాజా.

రాజశేఖర్ అపద్ధం చెప్పానని ఒప్పుకున్నాడు…
మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో ఎవరూ డబ్బులు ఖర్చుపెట్టుకుని ఓట్లు కొని గెలవరని శివాజీ అభిప్రాయపడ్డారు. మా అసోసియేషన్ లో ఎవరూ దోచుకోలేరంటూ డబ్బు సంపాదన అసోసియేషన్ నుండి ఏం రాదని, అక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఎంతో మంది ఉద్యోగులు పనిచెస్తూ ఉంటారు అంటూ చెప్పారు శివాజీ. ఇక శివాజీ రాజా పాల్గొన్న ఎన్నికల సమయంలో వాళ్లకు వ్యతిరేకంగా నిలబడిన ప్యానెల్ నుండి గెలిచిన హీరో రాజశేఖర్ తమ ప్యానెల్ ఎలా గెలిచిందో స్టేజి మీదే చెప్పేసాడు. మేము అపద్ధాలు చెప్పి గెలిచామంటూ అందరి ముందు చెప్పారు అంటూ శివాజీ తెలిపారు.

నరేష్ అయినా శివాజీ అయినా శ్రీకాంత్ అయినా ఎవరైనా మా అధ్యక్షులు అయ్యాక సేవ చేస్తారు వారికి తెలియనట్లు అంతేకాని ఎవరూ అక్కడ డబ్బులు దోచుకోవడం లాంటివి చేయలేరు అంటూ మాట్లాడారు శివాజీ. కొంతమంది మా సంఘంను పట్టించుకుని బాగా చేయాలి అనే తపనతో ఉంటారు మరికొంతమంది అంటూ చురుకుగా వ్యవహారించరు అంటూ చెబుతూ మా లో పనిచేసిన సమయంలో నరేష్ తన గురించి మహేష్ బాబు వాళ్ళ ఇంట్లో నమ్రత గారికి చెప్పాడు. శివాజీ అందరి ప్రెసిడెంట్లలో కష్టపడిపని చేసిన వ్యక్తి అంటూ చెప్పాడు. మా మధ్య విబేధాలు ఉండవుచ్చు కానీ అలా చెప్పడం నరేష్ గొప్పతనం అంటూ చెప్పారు శివాజీ రాజా.































