Actress Ashmita : ఈటీవీ లో వచ్చిన పద్మవ్యూహం సీరియల్ ద్వారా నటిగా మారిన ఆశ్మిత సీరియల్స్ తో పాటు పలు సినిమాల్లోనూ కనిపించింది. అయితే ఎక్కువగా సీరియల్స్ తో గుర్తింపు పొందిన అస్మిత మా టీవిలో ప్రసారమయ్యే అగ్నిసాక్షి సీరియల్ ద్వారా విలన్ గా కూడా బాగా నటించి ప్రేక్షకులకు ఇంకా దగ్గరైంది. ఇక తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా యూత్ కి బ్యూటీ టిప్స్ చెబుతూ మంచి ఫాలోయింగ్ తో ఉన్న అస్మిత కొంత మంది ఆకాతాయిలు వేధించడంతో వారిని సోషల్ మీడియాకు ఈడ్చి అంతవరకు ఏ అమ్మాయి చేయనటువంటి పని చేసి అలా రోడ్డుపై ఏడిపించేవారికి బుద్ధి వచ్చేలా చేసింది. రీసెంట్ గా యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న అస్మిత తన కెరీర్ అలాగే తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి వివరించింది.

వాళ్ళు చాలా దారుణంగా వేధించారు…
అస్మిత సీరియల్స్ అలాగే పలు సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతం కొరియోగ్రాఫర్ సుధీర్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిన ఈ రాజస్థాని నటి తాను ఎదుర్కొన్న ఇబ్బందులను పేర్కొనింది. తాను షూటింగ్ ముగించుకుని తన కారులో వస్తున్న సమయంలో కొంతమంది ఆమె కారును అడ్డగించి నువ్వు అక్కడ యాక్సిడెంట్ చేసావ్ వాళ్ళను హాస్పిటల్ లో జాయిన్ చేసి వస్తున్నాం డబ్బులు ఇవ్వు అంటూ వేధించారట.

కారులో ఉన్నది అస్మిత అని గుర్తుపట్టి అసిస్టెంట్ ను ఇక్కడే పెట్టుకుంటాం వెళ్లి డబ్బు తీసుకురా అంటూ వేధించడంతో పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళు వచ్చాక అక్కడి నుండి వెళ్లాల్సి వచ్చింది అంటూ తెలిపింది. ఇక మరోసారి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద కారులో ఉండగా కొంత మంది ఆకతాయిలు కారులోకి తొంగి చూడటం ఇబ్బందికరంగా బిహేవ్ చేయడంతో వారి ఫోటోలను తీసి బైక్ నెంబర్ తీసి ఫేస్ బుక్ లో పెట్టడంతో వారిని షీ టీం వారు అరెస్ట్ చేసారు. ఈ సంఘటన బాగా వైరల్ అవడం వల్ల అప్పటి నుండి అమ్మయిలు ఇలా ఎవరైనా ఇబ్బంది పెడితే ఫోన్ తీసుకుని ఫోటో తీయడానికి పోగానే అలాంటి వాళ్ళు భయపడుతున్నారు అంటూ అస్మిత అభిప్రాయపడ్డారు.


































