Genelia: ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జెనీలియా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఈమె తెలుగులో బొమ్మరిల్లు, ఢీ, రెడీ, వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన గుర్తింపు పొందారు. ఇకపోతే ఈమె హీరోయిన్ గా గుర్తింపు పొందిన సమయంలోనే నటుడు రిషితేష్ దేశ్ ముఖ్ ను వివాహం చేసుకున్నారు.
ఈ విధంగా వివాహమైన తర్వాత జెనీలియా పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఈమె ఇండస్ట్రీకి దూరంగా ఉన్న జెనీలియా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ఇలా పిల్లల బాగోగులు చూసుకుంటూ ఈమె పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోయారు. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్న జెనీలియా సినిమా అవకాశాలు వస్తే నటిస్తానని వెల్లడించారు.
ఇకపోతే ఇన్ని రోజులపాటు ఇండస్ట్రీకి దూరమై ఇద్దరు పిల్లలు తల్లి కావడంతో ఈమెకు హీరోయిన్ గా అవకాశాలు వచ్చే ఛాన్స్ లేదు అయితే జెనీలియా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తారని అలాంటి కథల కోసం తాను ఎదురుచూస్తున్నానని వెల్లడించారు. ఇక జెనీలియాని సినిమాలలో అక్క వదిన పాత్రలలో తీసుకుంటే ఆమెను అలాంటి పాత్రలలో చూడటానికి అభిమానులు ఏమాత్రం ఒప్పుకోరు.
ఈ విధంగా తనకు సరైన కథ దొరికితే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా తన హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ పెద్ద ఎత్తున ఫోటోషూట్ లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇకపోతే జెనీలియా హీరోయిన్ గా నటించే సమయంలో ఒక్కో సినిమాకు 70 నుంచి 80 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవారు.అయితే ఈమె గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా సందడి చేస్తుంది.ఇక ఈ సినిమా కోసం జెనీలియా భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో జెనీలియా నటించిన మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుందని తెలుస్తోంది. ఈమె ఈ రేంజ్ లో డిమాండ్ చేయడంతో నిర్మాతలు సైతం మాట కూడా మాట్లాడకుండా తాను అడిగిన మొత్తం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…