Actress Jaya Shree: తమిళ సీరియల్ నటి మహాలక్ష్మి గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. ఈమె కోలీవుడ్ ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ ను వివాహం చేసుకోవడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు.ఇలా అధిక శరీర ఖాయం ఉన్నటువంటి రవీందర్ ను మహాలక్ష్మి ఆస్తి చూసి మాత్రమే పెళ్లి చేసుకుందని పెద్ద ఎత్తున ఈమె పెళ్లిపై ఎంతోమంది ట్రోల్ చేశారు.
ఈ విధంగా రవీందర్ ను పెళ్లి చేసుకునే సమయానికి మహాలక్ష్మికి పెళ్లి జరిగి ఓ కుమారుడు కూడా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన అనంతరం ఈమె నిర్మాత రవీందర్ ను పెళ్లి చేసుకోవడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు.ప్రస్తుతం వీరి గురించి ఎంతోమంది ఎన్నో ట్రోలింగ్స్ చేసినప్పటికీ వాటి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతున్నారు.
ఇకపోతే తాజాగా తమిళ నటి జయశ్రీ గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా నటి మహాలక్ష్మి గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నటి మహాలక్ష్మి అనిల్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కుమారుడు కూడా ఉన్నారని తెలిపారు. అయితే ఈమె మరొక నటుడు ఈశ్వర్ రఘునాథ్ అనే నటుడితో ఎఫైర్ పెట్టుకుంది అంటూ ఈశ్వర్ భార్య జయశ్రీ మహాలక్ష్మి పట్ల సంచలనం వ్యాఖ్యలు చేశారు.
ఈ విధంగా తన భర్తతో మహాలక్ష్మికి ఎఫైర్ ఉండటంవల్లే అనిల్ తనకు విడాకులు ఇచ్చారంటూ ఈమె గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా వీరిద్దరి వ్యవహారం వల్ల తన భర్తకు తనకు మనస్పర్ధలు వచ్చాయంటూ జయ శ్రీ వెల్లడించారు. ఈ విషయం గురించి ఒకానొక సమయంలో ఈశ్వర్ తనపై చేయి చేసుకున్నాడని, ఈ విషయంపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈశ్వర్ ను అరెస్టు చేశారంటూ జయశ్రీ మహాలక్ష్మి గురించి షాకింగ్ విషయాలు బయట పెట్టారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…