Actress Jayalalitha : బోరింగు పాప అనగానే టక్కున గుర్తొచ్చే నాటి జయలలిత. తాజాగా జీ తెలుగులో ప్రసారమయ్యే సూపర్ హిట్ సీరియల్ ప్రేమ ఎంత మధురం లో హీరో ఆర్యవర్ధన్ తల్లిగా హుందగా కనిపించే పాత్రలో అదరగొడుతున్న జయలలిత గారు అటు సినిమాలు చేస్తూనే ఇటు సీరియల్స్ లో కనిపిస్తున్నారు. ఎక్కువగా వాంప్ తరహా పాత్రలను చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న జయలలిత ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం పెళ్లి తనకు చేదు జ్ఞాపకాలను మిగిల్చింది అంటూ చెప్పారు.

చచ్చిపోతా అని చివరికి చిత్ర వధ చేసాడు…
జయలలిత తెలుగు, కన్నడ తమిళంతో పాటు మలయాళంలోనూ ఎక్కువ సినిమాలను చేసారు. అందునా మలయాళంలో చాలా సినిమాలలో నటించిన ఆమె ఒక డైరెక్టర్ తో దాదాపు 25 సినిమాలను చేశారట. ఆ సమయంలోనే ఆ డైరెక్టర్ తో పరిచయం ప్రేమగా మారి ఇదేళ్లు ప్రేమించుకున్నారట. ఇంట్లో వాళ్ళు, తెలుగు ఇండస్ట్రీలో వాళ్లకు అతడిని పరిచయం చేస్తే వద్దు దొంగ కోళ్లు పట్టేవాడిలాగా ఉన్నాడు, ఆలోచించుకో అని చెప్పారట. అయితే ఆ డైరెక్టర్ మాత్రం పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను అంటూ మాట్లాడటంతో అతడిది నిజమైన ప్రేమ అనుకుని కోచ్చిన్ లో పెళ్లి చేసుకున్నారట. అయితే పెళ్ళైన కొద్ది రోజులకే ఆస్తి కోసం డబ్బు కోసం చిత్రవధ చేసేవాడని, ఒక గదిలో ఉంచి హింసించిగా చలపతి రావు, పరుచూరు గోపాలకృష్ణ గారి వల్ల బయటికి రాగలిగానని, అక్కడే ఉంటే ఏమైపోయి ఉండేదాన్నో తెలియదు అంటూ చెప్పారు. అలా ఆ డైరెక్టర్ నా జీవితాన్ని నాశనం చేసాడు అంటూ చెప్పారు.

ఇక గుమ్మడి గారి గురించి మాట్లాడుతూ గుమ్మడి గారిని చివరి రోజుల్లో బాగా చూసుకున్నాను. ఆయన అడిగిన వంట చేసుకుని వెళ్లి ఆయనతో కాసేపు మాట్లాడి వచ్చేదాన్ని కానీ ఆయనకు నాకు మధ్య ఇంకేదో సంబంధం ఉంది అన్నట్లుగా చిత్రీకరించారు. ఎన్టీఆర్ లక్ష్మి పార్వతి లాగా వీళ్ళు తయారయ్యారు అన్నట్లు మాట్లాడారు. ఆయన మరణించాక ఆయన పిల్లలు అలానే దూరం పెట్టారు. నిజానికి ఆయన వద్ద ఆస్థి లేదు నేను ఆయన చిన్న కూతరు కంటే మూడేళ్లు చిన్నదాన్ని అలాంటి నాకు సంబంధం పెట్టుకోవాలంటే వయసులో ఉండేవాళ్ళు దొరకరా, కానీ మా మధ్య ఎలాంటి సంబంధం ఉందో ఆ దేవుడికే తెలుసు. నేను తప్పు చేయలేదని నాకు తెలుసు అందుకే నిర్భయంగా ఉన్నాను అంటూ జయలలిత చెప్పారు.



























