సినిమా పరిశ్రమలో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. ఒకే హీరో సరసన హీరోయిన్ గా నటించిన పలువురు కొంత కాలం తర్వాత అదే హీరోకు తల్లిగా నటించిన సందర్భాలున్నాయి. నాటి భానుమతి నుంచి నేటి అనుష్క శెట్టి వరకు ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయి.
ఎన్టీఆర్, క్రిష్ణ, చిరంజీవి తో పాటు నేటి తరానికి చెందిన ప్రభాస్ వరకు ఇలాంటి పాత్రలు ఎదురయ్యాయి. ఒకప్పటి వాళ్ల హీరోయిన్లు అనంతరం అమ్మగా నటించారు. ఇంతకీ అలా నటించిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
*భానుమతి
భానుమతి అనగానే ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గానే గుర్తుకు వస్తుంది. అలాంటి తను 1992లో వచ్చిన సామ్రాట్ అశోక సినిమాలో ఎన్టీఆర్ కు తల్లిగా నటించింది.
*శారద
తన అద్భుత నటనతో ఎన్నో అవార్డులు అందుకున్న శారద.. కృష్ణతో కలిసి రాధమ్మ పెళ్లి, ఆడంబరాలు, అనుబంధాలు, ఇంద్రధనస్సు సినిమాలు చేసింది. అనంతరం అగ్ని కెరటాలు, రౌడీ నెంబర్ వన్, అగ్నిపర్వతం లాంటి సినిమాల్లో కృష్ణక తల్లిగా చేసింది.
*అంజలి దేవి
నాగేశ్వరరావుతో కలిసి ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. అనంతరం పలు సినిమాల్లో ఏఎన్ఆర్ తల్లిగా నటించింది.
*జయసుధ
చిరంజీవితో పలు సినిమల్లో హీరోయిన్ గా చేసింది జయసుధ. కొంతకాలం తర్వాత జయసుధ రిక్షావోడు సినిమాలో చిరంజీవికి తల్లిగా నటించింది.
*సుజాత
దివంగత నటీమణి సుజాత కూడా చిరంజీవితో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత బిగ్ బాస్ సినిమాలో చిరంజీవి తల్లిగా చేసింది.
*భానుప్రియ
జయం మనదేరా సినిమాలో వెంకటేష్ తల్లిగా నటించిన ఆమె.. అదే సినిమాలో సీనియర్ వెంకటేష్ కు భార్యగా యాక్ట్ చేసింది. అంతకు ముందు శ్రీనివాస కల్యాణం, స్వర్ణకమలం వంటి పలు సినిమాలలో హీరోయిన్ గా నటించింది.
*అనుష్క శెట్టి
బాహుబలి సినిమాలో సీనియర్ ప్రభాస్ కు భార్యగా.. జూనియర్ ప్రభాస్ కు భార్యగా నటించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…