Adhire Abhi : జబర్దస్త్ లో ఈ మధ్య కామెడీ కన్నా కిర్రాక్ ఆర్పి పుణ్యమా అని అక్కడ ఉన్న వివాదాలే హైలైట్ అవుతున్నాయి. అసలు జబర్దస్త్ లో ఏం జరుగుతోంది, ఆర్టిస్టులందరూ ఎందుకు వెళ్లిపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలయింది. ఇక కిర్రాక్ ఆర్పి అక్కడ మనుషుల్లా మమ్మల్ని చూడరు, తిండి సరిగా ఉండదు, అవమానిస్తారు, ఇక ఆర్థిక సహాయాలు అసలే ఉండవు అన్న రేంజ్లో మాట్లాడేసాడు.

వారికి నమ్మకం కలిగిన వారికి అడ్వాన్స్ పేమెంట్స్ ఉంటాయి…
కిర్రాక్ ఆర్పి రాజేసిన అగ్గికి చలి కాచుకుంటోంది కొందరైతే మరి కొందరు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. అలా జబర్దస్త్ వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తున్నారు. అలానే అదిరే అభి కూడా ఈ మధ్య జబర్దస్త్ మానేసాడు. ఇక అక్కడి విషయాలను సోషల్ మీడియాలో ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు. ఇల్లు కట్టుకోడానికి శ్యామ్ ప్రసాద్ గారు సహాయం చేసారా అన్న ప్రశ్నకు అదిరే అభి మాట్లాడుతూ ఇంకో మూడేళ్లు వీళ్ళు ఎక్కడికీ వెళ్లరు మల్లెమాల సంస్థలోనే ఉంటారు అని వాళ్లకు నమ్మకం కలిగిన వారికి అడ్వాన్స్ పేమెంట్స్ ఇస్తారని అలా కొంతమందికి ఇచ్చారని చెప్పాడు.

అయితే తానెపుడూ అడ్వాన్స్ పేమెంట్ తీసుకోలేదని, నాకు అప్పు చేయడం అంటే చాలా భయమని నిద్ర పట్టదని అందుకే జీవితంలో ఎవరితోనూ అప్పు చేయలేదని ఒకసారి తన కజిన్ తో తీసుకున్న ఆ మొత్తాన్ని నెలలోపు తీర్చేశానని అభి అన్నారు. ఇక లాక్ డౌన్ సమయంలో మాత్రం షెడ్యూల్ కి డబ్బులు ఇంటికి మల్లెమాల వాళ్ళు పంపారని షూటింగ్ లేకపోయినా నెక్స్ట్ షెడ్యూల్ డబ్బులు ఇచ్చారని చెప్పాడు అభి.

































