Ajay Devagan & Kicha Sudeep : సౌత్ సినిమాల జోరు బాలీవుడ్ లో చిచ్చు రేపుతోంది. బాహుబలి తో మొదలై ఇక ఇపుడు కేజీఎఫ్ 2 వరకు పాన్ ఇండియా సినిమాలుగా బాలీవుడ్ విడుదలయి బాలీవుడ్ సినిమాలకు కాక పుట్టించాయి. ఇక బాలీవుడ్ సినిమాలపై విమర్శలు ఎక్కువయ్యాయి. ఇక బాలీవుడ్ లో కంటెంట్ ఉన్నా సినిమాలు రావడంలేదు అనే విమర్శ బాలీవుడ్ సెలబ్రిటీస్ ను ఇపుడు చికాకు పెడుతోంది. నిజానికి బాలీవుడ్ లో కంటెంట్ ఉన్న సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఎందుకు ది కాశ్మీరి ఫైల్స్, దస్వి లాంటి సినిమాలే నిదర్శనం. కానీ చాలా వరకు టాప్ హీరో సినిమాలంతా మూసగా సాగే యాక్షన్ సినిమాలే. దీంతో బాలీవుడ్ ప్రేక్షకులు పక్కా చూపులు చూస్తున్నారు. డబ్బింగ్ సినిమాల పుణ్యమా అని సౌత్ సినిమాల జోరు ఉత్తరాదిన పెరిగింది.
హిందీ జాతీయ భాష….
ఇక కేజీఎఫ్ 2 రచ్చ మాములుగా లేదు. కన్నడ సినిమా బాలీవుడ్ ను ఊపేసింది. ఇక ఈ విషయాన్నే కిచ్చా సుదీప్ తన సినిమా విక్రాంత్ రోణా ప్రమోషన్స్ లో భాగంగా కేజీఎఫ్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇక ఆ సమయంలోనే హిందీ ఇక నుంచి ఏమాత్రం జాతీయ భాష కాదు. నేడు బాలీవుడ్ ఎన్నో పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తోంది. తెలుగు, తమిళంలో డబ్ చేసేందుకు ఎంతో కష్టపడుతున్నారు. కానీ అవి అంతగా విజయం సాధించలేకపోతున్నాయి. కానీ ఈరోజు మనం తీస్తున్న సినిమాలను ప్రపంచం మొత్తం చూస్తున్నాయి.’ ఇక ఈ వాఖ్యలు ఇపుడు దుమారం లేపాయి.
ఇక ఈ వాఖ్యలకు స్పందించిన అజయ్ దేవగన్ హిందీ జాతీయ భాష కానపుడు ఎందుకు మీ సినిమాలను హిందీ లో డబ్ చేస్తున్నారు అంటూ ట్వీట్ చేసారు.హిందీ ఇప్పటికీ, ఎప్పటికీ మన మాతృ భాషే, జాతీయ భాషే, జనగణమన’ అంటూ సుదీప్ను ప్రశ్నించాడు. ఇక ఈ వివాదం హద్దు దాటుతుందేమో అని అనుకున్నారేమో సుదీప్ వెంటనే విషయాన్నీ సద్దుమనిగించే ప్రయత్నం చేసారు.హలో అజయ్ సార్. నా వ్యాఖ్యలకు అర్థం అది కాదు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని వ్యక్తిగతం కలిసినప్పుడు దీనికి మీకు వివరణ ఇస్తాను’ అని చెప్పుకొచ్చాడు.
మరో ట్వీట్లో భారతదేశంలోని అన్ని భాషలపై తనకు గౌరవం ఉందని, ఇక్కడితో ఈ టాపిక్ను వదిలేయాలనుకుంటున్నాను అంటూ సుదీప్ వరస ట్వీట్స్ చేశాడు. ‘ఎలాంటి అపార్థాలు చోటు చేసుకోకుండా దీనికి స్పష్టత ఇచ్చినందుకు ధన్యవాదాలు మై ఫ్రెండ్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబం అని నా అభిప్రాయం. మనమంతా దేశంలోని అన్ని భాషలను గౌరవించాలి’ అంటూ సుదీప్ ట్వీట్కు అజయ్ రిప్లై ఇచ్చాడు. ఇక ఇక్కడితో ఈ వివాదం ముగిసినట్టే అనిపిస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…