Ajay Devagan & Kicha Sudeep : సౌత్ సినిమాల జోరు బాలీవుడ్ లో చిచ్చు రేపుతోంది. బాహుబలి తో మొదలై ఇక ఇపుడు కేజీఎఫ్ 2 వరకు పాన్ ఇండియా సినిమాలుగా బాలీవుడ్ విడుదలయి బాలీవుడ్ సినిమాలకు కాక పుట్టించాయి. ఇక బాలీవుడ్ సినిమాలపై విమర్శలు ఎక్కువయ్యాయి. ఇక బాలీవుడ్ లో కంటెంట్ ఉన్నా సినిమాలు రావడంలేదు అనే విమర్శ బాలీవుడ్ సెలబ్రిటీస్ ను ఇపుడు చికాకు పెడుతోంది. నిజానికి బాలీవుడ్ లో కంటెంట్ ఉన్న సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఎందుకు ది కాశ్మీరి ఫైల్స్, దస్వి లాంటి సినిమాలే నిదర్శనం. కానీ చాలా వరకు టాప్ హీరో సినిమాలంతా మూసగా సాగే యాక్షన్ సినిమాలే. దీంతో బాలీవుడ్ ప్రేక్షకులు పక్కా చూపులు చూస్తున్నారు. డబ్బింగ్ సినిమాల పుణ్యమా అని సౌత్ సినిమాల జోరు ఉత్తరాదిన పెరిగింది.
హిందీ జాతీయ భాష….
ఇక కేజీఎఫ్ 2 రచ్చ మాములుగా లేదు. కన్నడ సినిమా బాలీవుడ్ ను ఊపేసింది. ఇక ఈ విషయాన్నే కిచ్చా సుదీప్ తన సినిమా విక్రాంత్ రోణా ప్రమోషన్స్ లో భాగంగా కేజీఎఫ్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇక ఆ సమయంలోనే హిందీ ఇక నుంచి ఏమాత్రం జాతీయ భాష కాదు. నేడు బాలీవుడ్ ఎన్నో పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తోంది. తెలుగు, తమిళంలో డబ్ చేసేందుకు ఎంతో కష్టపడుతున్నారు. కానీ అవి అంతగా విజయం సాధించలేకపోతున్నాయి. కానీ ఈరోజు మనం తీస్తున్న సినిమాలను ప్రపంచం మొత్తం చూస్తున్నాయి.’ ఇక ఈ వాఖ్యలు ఇపుడు దుమారం లేపాయి.
ఇక ఈ వాఖ్యలకు స్పందించిన అజయ్ దేవగన్ హిందీ జాతీయ భాష కానపుడు ఎందుకు మీ సినిమాలను హిందీ లో డబ్ చేస్తున్నారు అంటూ ట్వీట్ చేసారు.హిందీ ఇప్పటికీ, ఎప్పటికీ మన మాతృ భాషే, జాతీయ భాషే, జనగణమన’ అంటూ సుదీప్ను ప్రశ్నించాడు. ఇక ఈ వివాదం హద్దు దాటుతుందేమో అని అనుకున్నారేమో సుదీప్ వెంటనే విషయాన్నీ సద్దుమనిగించే ప్రయత్నం చేసారు.హలో అజయ్ సార్. నా వ్యాఖ్యలకు అర్థం అది కాదు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని వ్యక్తిగతం కలిసినప్పుడు దీనికి మీకు వివరణ ఇస్తాను’ అని చెప్పుకొచ్చాడు.
మరో ట్వీట్లో భారతదేశంలోని అన్ని భాషలపై తనకు గౌరవం ఉందని, ఇక్కడితో ఈ టాపిక్ను వదిలేయాలనుకుంటున్నాను అంటూ సుదీప్ వరస ట్వీట్స్ చేశాడు. ‘ఎలాంటి అపార్థాలు చోటు చేసుకోకుండా దీనికి స్పష్టత ఇచ్చినందుకు ధన్యవాదాలు మై ఫ్రెండ్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబం అని నా అభిప్రాయం. మనమంతా దేశంలోని అన్ని భాషలను గౌరవించాలి’ అంటూ సుదీప్ ట్వీట్కు అజయ్ రిప్లై ఇచ్చాడు. ఇక ఇక్కడితో ఈ వివాదం ముగిసినట్టే అనిపిస్తోంది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…