Ajay Ghosh : 2010వ సంవత్సరంలో విడుదల అయిన ‘ప్రస్థానం’ సినిమా ద్వారా సినిమాలకు పరిచయం అయ్యాడు అజయ్ ఘోష్. తరువాత రన్ రాజా రన్, జ్యోతి లక్ష్మి, బహుబలి 2, భాగమతి, రంగస్థలం వంటి సినిమాలలో నటించి అభిమానులకు చేరువ అయ్యారు. ఇటీవల ‘పుష్ప’ సినిమాలోని ‘కొండా రెడ్డి’ పాత్రతో ఆకట్టుకున్నారు. పక్కా కమర్షియల్ సినిమాలో కూడా అజయ్ ఘోష్ అలరించాడు. అయితే తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తనకు సంబందించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

అమ్మాయిల గొంతుతో అర్ధరాత్రి ఫోన్ చేస్తారు…
ఇటీవల పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తన గుండు గురించి ప్రస్తావించగా, మా పెద్దబ్బాయి జతలో ఇంగ్లీష్ సినిమాలు చూసి నాకంటూ కూడా ఒక ప్రత్యేకత ఉండాలని చేయించుకున్నట్టు చెప్పుకొచ్చారు. ఇక సెట్ లో అయినా ఎక్కడైనా నేను ఒకేలాగే ఉంటానని, అలానే ఉన్నా కూడా నాకంటూ ఆప్యాయ్యంగా పలకరించే వారు ఉన్నారని చెప్పారు. సునీల్, ప్రవీణ్, ధన్ రాజ్ లాంటి వాళ్ళు నాతో సన్నిహితంగా ఉంటారని, ధన్ రాజ్, ప్రవీణ్ ఏకంగా అర్ధరాత్రి నాకు అమ్మాయి గొంతుతో ఫోన్ చేసి ఆటపాట్టిస్తారని చెప్పుకొచ్చారు.

ఇక కోటా శ్రీనివాస రావు గారు అంటే మీకెందుకు అంత అభిమానం అన్న ప్రశ్నకు.. నా దృష్టిలో ఆయన ఒక లెజెండ్ అని చెప్పారు. ఏదైనా పాత్ర చేస్తే కోటా శ్రీనివాసరావు గారు కనిపించరు, ఆ పాత్ర మాత్రమే మనకు కనిపిస్తుంది. నటనలో అయన నీడను నేను చేరుకున్నా, నేను చాలా గొప్ప నటుడు అయ్యాను అని భావిస్తాను. ఆయనను చూసి నేను చాలా ప్రభావితున్ని అయ్యాను. అని కోటా మీద తనకున్న అభిమానాన్ని చెప్పుకొచ్చారు. అజయ్ ఘోష్ తెలుగు తో పాటు తమిళ్, కన్నడ సినిమాలలో కూడా నటించారు.

































