Ajay Ghosh : ‘పుష్ప’ సినిమాలోని ‘కొండా రెడ్డి’ పాత్రతో బాగా పేరు తెచ్చుకున్నారు అజయ్ ఘోష్. ఈయన 2010 లో విడుదల అయిన ‘ప్రస్థానం’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. తెలుగుతో పాటు తమిళ్ కన్నడ సినిమాలలో కూడా అజయ్ ఘోష్ నటించారు. రన్ రాజా రన్, జ్యోతి లక్ష్మి, బహుబలి 2, భాగమతి, రంగస్థలం వంటి సినిమాలలో అజయ్ ఘోష్ నటించారు. ఇక తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాల గురించి చెప్పారు.
ఆచార్య సినిమాలో నటించాల్సి ఉన్నింది…
తెలుగు సినిమాలలో విలన్ పాత్రలతో మంచి పేరు తెచ్చుకున్న అజయ్ ఘోష్… తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి తో కలసి నటించే అవకాశం పోయిందని చెప్పుకొచ్చారు. కొరటాల శివ గారి దర్శకత్వంలో వచ్చిన ఆచార్య సినిమాలో మొదటి సారి చిరంజీవి గారితో కలసి నటించబోతున్నాను అని చాలా సంతోషించాను అని చెప్పారు. అయితే సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు నాకు హార్ట్ ప్రాబ్లమ్ రావడం స్టంట్ వేయించుకోవడంతో సినిమాలో నటించలేకపోయాను అని చెప్పారు. అయితే తరువాత అయినా ఖచ్చితంగా కొరటాల దర్శకత్వంలో సినిమా ఖచ్చితంగా చేస్తాను అని అజయ ఘోష్ చెప్పుకొచ్చారు.
ఇక రంగస్థలం సినిమా గురించి మాట్లాడుతూ.. షూటింగ్ సమయంలో ఫైట్ సీన్ చేసే అపుడు కాలికి దెబ్బ తగిలిందని, అయితే వెంటనే రామ్ చరణ్ గారు అపోలో హాస్పిటల్ కి పంపించి ట్రీట్మెంట్ ఇప్పించారని చెప్పారు. రామ్ చరణ్ చాలా గొప్పవాడు, నాకు అలా అవ్వగానే చాలా సహాయం చేశారు అని చెప్పుకొచ్చారు. అయితే వయసు రీత్య కాలికి తగిలిన దెబ్బ పోలేదని చెప్పుకొచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…