Akhanda Movie : మొన్న పుష్ప, నిన్న ఆర్ ఆర్ ఆర్ ఇప్పుడు కార్తికేయ 2… ఇలా వరుసగా మన తెలుగు సినిమాలు బాలీవుడ్ లో రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మన సినిమాలకు నార్త్ జనాలు నీరాజనాలు పడుతున్నారు. కార్తికేయ2 సినిమా విడిదల అయి మూడు వారాలు అవుతున్నా నార్త్ లో కలెక్షన్లు తగ్గట్లేదు. ఇప్పటికి 30 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. కృష్ణ భగవానుడికి కథ ముడిపడి ఉండటంతో అక్కడి వారు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక ఇప్పుడు తాజాగా బాలయ్య అభిమానులు చర్చించుకుంటున్న ఒక విషయం అంతటా వైరల్ అవుతోంది.

నార్త్ లో అఖండ బొమ్మ పడి ఉండింటే…
నందమూరి బాలయ్య నటించిన అఖండ సినిమా మన దగ్గర ఎలాంటి రికార్డులు సృష్టించిందో మనకు తెలిసిందే. కరోనా తర్వాత మొదటి సారి ప్రేక్షకులను థియేటర్ కు రప్పించగలిగింది. సెకండ్ హాఫ్ లో అఘోరా గా బాలకృష్ణ నటన అద్భుతం అనే చెప్పాలి. సినిమా మొత్తం అవసరం లేదు ఆఖరి అర గంట సినిమా రిపీట్ చేస్తూ రెండు గంటలు చూడొచ్చు అంటారు అభిమానులు, ఆ సీన్ కు తగ్గ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, బాలకృష్ణ నటనతో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి.

మొత్తం శివ తత్వం మీద వచ్చిన ఈ సినిమా నార్త్ లో గనుక పడి ఉన్నింటే థియేటర్ లో భూకంపం వచ్చేదని అభిమానులు అనుకుంటున్నారు. కార్తికేయ సినిమాకే నార్త్ లో నీరాజనాలు పడుతుంటే ఇక అఖండ సినిమా అయితే ఇంకెలాగ ఉండేదని చర్చించుకుంటున్నారు. అందరూ కూడా నిజమే అఖండ సినిమాని హిందీలో డబ్ చేసి విడుదల చెసింటే బాలయ్య పాన్ ఇండియా స్టార్ అయిపోయేవాడు అంటున్నారు.

































