జూలై మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు బలహీనపడిన ప్రభావంతో.. దేశంలోని ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. యూపీ, బీహార్, అసోం, మేఘాలయ, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో నేటి నుంచి ఈనెల 5వ తేదీ వరకు భారీవర్షాలు కురుస్తాయని, పలు ప్రాంతాల్లో వరదలు కూడా పోటెత్తుతాయని హెచ్చరించారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి గాలులు ఎక్కువగా వీస్తున్నాయి. వీటి ప్రభావంతో.. ఇవాళ, రేపు ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ వర్ష ప్రభావం ఉండనుంది.































