Allari shubhashini : నాటక రంగం నుండి, సినిమా రంగానికి వచ్చిన ఆర్టిస్టుల్లో సుభాషిణి ఒకరు. చింతామణి నాటకం ద్వారా బాగా ఫేమస్ అయిన సుభాషిణి గారికి చలపతిరావు గారు తన కొడుకు రవిబాబు సినిమాలో అవకాశం గురించి చెప్పారు. ఇక రవిబాబు గారి సినిమా అల్లరి లో మొదట అవకాశం వచ్చి ఆ సినిమాతో అల్లరి సుభాషిణిగా పేరు తెచ్చుకున్నారు. ఇక ఆ తరువాత చెన్నకేశవ రెడ్డి, ఈశ్వర్, బెండు అప్పారావు ఆర్ఎమ్పి సినిమా దగ్గర నుండి గుంటూరు టాకీస్ సినిమా వరకు పలు చిత్రాల్లో కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు.

క్యాన్సర్ వచ్చిందని చెప్పగానే సుమ ఏం చేసిందంటే…
ఇక పలు సినిమాలలో నటిస్తూ కెరీర్ బాగా ఉన్నపుడే క్యాన్సర్ రావడంతో మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాగిణి కి చెప్పగా బాలకృష్ణ గారిని కలిసి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి వెళ్ళమని చెప్పారట. ఇక సుభాషిణి గారికి ఎంతో సన్నిహితులైన చలపతిరావు గారు బసవతారకం వద్ద డాక్టర్లకు సిఫార్సు చేయించారట. ఇక ఆ తరువాత నాటక రంగంలో తెలిసిన వ్యక్తి కనిపించి ప్రభుత్వం ద్వారా చికిత్స చేయించుకునే మార్గం చెప్పగా పదిహేను లక్షల దాకా ఖర్చు వస్తుందనుకుంటే ఐదు వేల రూపాయల ఖర్చుతో చికిత్స పూర్తయిందట.

ఇక సినిమా ఇండస్ట్రీ నన్ను అసలు వదల్లేదు, అందరూ సహాయం చేసారు. ఇక మందులు చాలా ఖరీదైనవి కావడంతో యాంకర్ సుమ కి పరిస్థితి చెబితే అమెరికన్ సంస్థ ద్వారా ప్రతి ఆరు నెలలకి ఒకసారి మందులు పంపిస్తారట. ఇక చిరంజీవి గారు ఫోన్ చేస్తే అవకాశాలు కచ్చితంగా నేను ఇప్పిస్తానని, ముందు కోలుకుని నిండు ఆరోగ్యంతో రమ్మని చెప్పారట. ఇక ఇప్పుడిప్పుడే సినిమా అవకాశలు వస్తున్నాయట. ఇక సీరియల్స్ లో కూడా నటించమని అడుగగా అంతసేపు పనిచేయలేనని చెప్పారు. ఇక సుభాషిణి సీరియల్ ను నిర్మించగా అందులో తను సంపాదించిన అన్ని డబ్బులు పెట్టుబడి పెట్టానని సీరియల్ దూరదర్శన్ లో ప్రసారం అవ్వడానికి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ గారు సహకరిస్తే నా డబ్బులు వస్తాయి, నా కుటుంబం బాగుపడుతుందని ఆర్ధిక ఇబ్బందులతో ఉన్న మాకు ఆ సీరియల్ విడుదల చాలా ముఖ్యమని చెప్పారు సుభాషిణి.



























