Allu Aravind: తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అరవింద్ ఈ మధ్యకాలంలో నందమూరి నటసింహం బాలకృష్ణతో ఎంతో మంచి సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే అల్లు అరవింద్ బాలయ్యను ఏకంగా అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా తీసుకువచ్చారు. అదేవిధంగా తన కుమారుడు అల్లు శిరీష్ నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ బాలకృష్ణ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడతారని తనతో ఐదు నిమిషాలలో పని పూర్తవుతుందని తెలిపారు.అన్ స్టాపబుల్ కోసం తనకు ఫోన్ చేసి మీరు వ్యాఖ్యతగా ఉండాలి అని అడిగాను. వెంటనే టీం పంపించండి అని చెప్పారు.ఇలా తన టీం వెళ్లి అన్ని వివరించిన తర్వాత ఓకే తనకు టీం నచ్చింది మిగతా విషయాలు మనం మాట్లాడుకుందాం అని ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఓకే చెప్పారు.
ఇక శిరీష్ సినిమా వేడుక కోసం బాలయ్యను ఆహ్వానించగా మన శిరీష్ కదా తప్పకుండా వస్తా అంటూ ఈ సినిమా వేడుకకు వచ్చారని అల్లు అరవింద్ వెల్లడించారు. ఈయన ఏ విషయాన్ని దాచుకోరని ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడతారని , ఆయనకు స్టార్ హీరో అనే అహం లేదంటూ అరవింద్ పేర్కొన్నారు.

Allu Aravind: సింపుల్ ఆటిట్యూడ్…
ఈ విధంగా సింపుల్ యాటిట్యూడ్ చూపించే బాలకృష్ణకు అందరూ అభిమానులే అంటూ ఈ సందర్భంగా అల్లు అరవింద్ చేస్తున్నటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ మధ్యకాలంలో అల్లు అరవింద్,బాలకృష్ణ మధ్య మంచి రిలేషన్ ఏర్పడటంతో గీతా ఆర్ట్స్ బ్యానర్లు బాలయ్యతో సినిమా చేయడానికి అల్లు అరవింద్ కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.




























