Featured

Allu Arjun : పెళ్ళిలో అల్లు అర్జున్ ఎంత కట్నం తీసుకున్నాడో చెప్పిన మావయ్య చంద్రశేఖర్ రెడ్డి.

Allu Arjun : మామూలుగానే తమ అభిమాన సెలబ్రిటీల పర్సనల్ విషయాలు గురించి అభిమానులు ఎంతో ఆసక్తికరంగా గమనిస్తుంటారు. వారి పెళ్లి, పిల్లలు కుటుంబానికి సంబంధించిన ఫోటోలు, ట్రిప్పుల హడావిడి ఇలా ఒకటేమిటి ప్రతి చిన్న విషయం వీరికి ఆనందాన్ని కలిగిస్తుంది. చిన్నచిన్న సెలబ్రిటీల విషయంలోనే ఫ్యాన్స్ ఇంత ఆనందపడి పోతే ఇంక మన తెలుగు సూపర్ స్టార్ అయిన ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి హీరో లకు సంబంధించిన విషయాలు అయితే అభిమానుల ఆనందలకు హద్దులు వుండవు.

ప్రస్తుతం అల్లు అర్జున్ కి సంబందించిన ఇలాంటి ఒక వార్తనే అల్లు అర్జున్ వాళ్ళ మావయ్య చంద్రశేఖర్రెడ్డి ఒక ఇంటర్వ్యూలో అభిమానులకు తెలియజేశారు. అల్లు అర్జున్, స్నేహారెడ్డిలు లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం అందరికి తెలిసిందే . 2011లో అల్లు అర్జున్ , స్నేహల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. దాదాపు 11 ఏళ్లుగా బన్నీ – స్నేహల వివాహ బంధం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. అయితే.. తాజాగా స్నేహారెడ్డి గారి తండ్రి అయిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ , స్నేహాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

అల్లు అర్జున్ కట్నం గురించి చెప్పిన మావయ్య…..

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు కూతురు స్నేహ రెడ్డి అల్లు అర్జున్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి సమయంలో అల్లు అర్జున్ తీసుకున్న కట్నం కానుకలు గురించి ప్రస్తావించగా ఆయన అసలు కట్నం తీసుకోలేదని వారి కుటుంబం మొత్తం కట్నం తీసుకోవడం అనే ఆలోచనకు విరుద్ధంగా ఉంటారని ఆయన తెలియజేశారు. అంతే కాకుండా అల్లు అర్జున్ కుటుంబానికి ఎక్కువగా విలువ ఇస్తారని ఆయన తెలియజేశారు. అల్లు అర్జున్ వాళ్ళ మావయ్య చెప్పిన ఈ విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago