తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలు కరోనా కారణం చేత వాయిదా పడుతూ వచ్చాయి. అయితే ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉండటం చేత సినిమాలన్నీ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోని జనవరి నెలలో RRR, భీమ్లా నాయక్, రాధేశ్యామ్, ఆచార్య వంటి చిత్రాలు విడుదలకు సిద్ధం అయ్యాయి. ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా డిసెంబర్ నెలలో విడుదలకు సిద్ధం అయింది.
ఈ క్రమంలోనే డిసెంబర్ 25వ తేదీ ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ముందుగా చిత్రబృందం వెల్లడించినప్పటికీ పలు కారణాల వల్ల ఈ చిత్రాన్ని డిసెంబర్ 17వ తేదీకి మార్చుకున్నారు. ఈ క్రమంలోనే క్రిస్మస్ పండుగ సందర్భంగా ఎలాంటి సినిమాలు విడుదల లేకపోవడంతో డిసెంబర్ 24వ తేదీ నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ ఈ సినిమాని విడుదల చేయాలని చిత్రబృందం భావించారు.
అయితే ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఈ సినిమా 17వ తేదీ కాకుండా ముందుగా అనుకున్న ప్రకారం 25 వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇదే కనుక జరిగితే పూర్తిగా అల్లు అర్జున్ పుష్ప సినిమా నాని సినిమాను చిక్కుల్లో పడేసినట్టు అవుతుంది.
ఇక డిసెంబర్ 24వ తేదీ నాని సినిమా విడుదల కాకపోతే మరో రెండు నెలల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. జనవరి నెలలో స్టార్ హీరోల సినిమాలు పాన్ ఇండియా చిత్రాలు వరుసగా విడుదల కావడంతో ఖచ్చితంగా మరో రెండు నెలల వరకు నాని తన సినిమాను పోస్ట్ ఫోన్ చేసుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవేళ పుష్ప సినిమా 25వ తేదీ కూడావిడుదల కాలేకపోతే నాని సినిమా యధా విధిగా విడుదలవుతుంది లేదంటే మరోసారి నాని తన సినిమాను వాయిదా వేసుకుంటాడా లేదంటే అల్లు అర్జున్ ను ఢీ కొడతాడా తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…