బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ అఖండ సినిమాలో నటిస్తుండగానే క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు బాలకృష్ణ. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో బాలకృష్ణ తదుపరి సినిమా షూటింగ్లో పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ తన 107 వ చిత్రాన్ని ఈ రోజు పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టారు.
నేడు హైదరాబాద్లో ఎంతో ఘనంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను ప్రారంభించగా ఈ కార్యక్రమానికి ఎంతో మంది స్టార్ డైరెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివి వినాయక్ కొరటాల శివ, హరీష్ శంకర్, బోయపాటి, బుచ్చిబాబు, బాబీ మొదలైన డైరెక్టర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న అనంతరం వివి వినాయక్ క్లాప్ కొట్టగా బోయపాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. హరీష్ శంకర్ గౌరవ దర్శకత్వం వహిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ప్రారంభించారు.
గోపీచంద్ బాలకృష్ణ కాంబోలో తెరకెక్కుతున్నటువంటి మాస్ అండ్ యాక్షన్ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇకపోతే ఈ ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ నటిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమంలో హీరోయిన్ శృతి హాసన్ కూడా పాల్గొన్నారు.NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. మరి ఈ సినిమాకు గోపీచంద్ ఎలాంటి టైటిల్ ను పెడతారు అనే విషయం తెలియాల్సి ఉంది. ఇకపోతే బోయపాటి బాలయ్య కాంబోలో తెరకెక్కిన అఖండ సినిమా కోసం బాలయ్య అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…