Allu Arjun: అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా విడుదలకు కొన్ని గంటల సమయం ఉన్న నేపథ్యంలో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఈ సినిమాకు మద్దతుగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ విషెస్ చెబుతున్నారు.

ఈ క్రమంలోనే మెగా హీరో కూడా ఈ సినిమాకు విష్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది . అల్లు అర్జున్ ఎప్పుడైతే వైకాపా నాయకుడుకు మద్దతు తెలిపారు అప్పటినుంచి మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ దూరం పెడుతూ వస్తుంది ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా పుష్ప సినిమా గురించి స్పందించలేదు.
ఇక అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలియజేయకపోవడంతో మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ ఏకంగా అల్లు అర్జున్ అలాగే ఆయన భార్య స్నేహారెడ్డిని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేశారు. అయితే నేడు పుష్ప సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా పుష్ప సినిమాకు అలాగే అల్లు అర్జున్ కు బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఈయన చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Allu Arjun: సాయి ధరంతేజ్..
ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ పోస్ట్ చేస్తూ అల్లు అర్జున్ అలాగే సుకుమార్ అండ్ టీంకు నా హృదయపూర్వక బ్లాక్ బాస్టర్ శుభాకాంక్షలు అంటూ ఈయన చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక ఈ పోస్ట్ పై నేటిజన్స్ విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఇక ఈ పోస్ట్ పట్ల అల్లు అర్జున్ స్పందిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.


























