Allu Arjun: వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలలో నిజం లేదంటే వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని దాచి పెట్టే ప్రయత్నం చేశారు.అయితే చివరికి వీరిద్దరూ తమ ప్రేమ గురించి ఓపెన్ అవుతూ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు.ఈ క్రమంలోనే జూన్ 9వ తేదీ లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగింది.
ఇలా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ఇదివరకే వార్తలు వచ్చిన విషయం మనకు తెలిసిందే అయితే వీరిద్దరి ప్రేమ విషయాన్ని అల్లు అరవింద్ ముందుగానే పసిగట్టారంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అల్లు అర్జున్ నిర్మాణంలో లావణ్య త్రిపాఠి హీరో కార్తికేయతో కలిసి చావు కబురు చల్లగా అనే సినిమాలో నటించారు.
ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా లావణ్య త్రిపాటి తెలుగులో వేదికపై చాలా స్పష్టంగా మాట్లాడుతుంది.ఈ విధంగా లావణ్య త్రిపాఠి మాట్లాడుతున్న సమయంలో అల్లు అరవింద్ తన చేతిలో మైక్ లాక్కుని ఎక్కడో నార్త్ లో పుట్టిన నువ్వు ఇలా స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నావు ఇక్కడే ఒక తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపో అంటూ కామెంట్స్ చేశారు. ఈ వీడియోని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అల్లు అరవింద్ చాలా టాలెంటెడ్ అని, వీరు ప్రేమ విషయాన్ని ముందుగానే పసిగట్టారంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇక మరికొందరైతే ఎవరో ఒకరిని చూసుకోమంటే మీ ఫ్యామిలీలో అబ్బాయిని చూసుకుంది అంటూ ఈ వీడియో పై ఫన్నీ కామెంట్ చేయగా అల్లు అర్జున్ సైతం ఈ వీడియో పై రియాక్ట్ అయ్యారు.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఈ వీడియోని ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేస్తూ మా నాన్నకు చాలా ముందుచూపు ఎక్కువ అంటూ ఫన్నీగా కామెంట్ చేయడంతో ఇది కాస్త మరింత వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…