ప్రస్తుత కాలంలో స్టార్ హీరోలు, స్టార్ సెలబ్రెటీలు మాత్రమే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటమే కాకుండా వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూవారి కుటుంబానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ విధంగా సోషల్ మీడియాలో స్టార్ హీరోలైన మహేష్ బాబు, రామ్ చరణ్, బన్నీ వీరి సతీమణులు సోషల్ మీడియాలో యమ స్పీడ్ గా ఉంటారు.
మహేష్ బాబు భార్య నమ్రత ఒకప్పుడు హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే తన కుటుంబానికి సంబంధించిన విషయాలను మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన విషయాలను నమ్రత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన సైతం అపోలో సంస్థలకు సంబంధించిన విషయాలను, పలు ఆరోగ్య విషయాలను, అదే విధంగా తన భర్త రామ్ చరణ్ కి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. వీరిద్దరి కన్నా సోషల్ మీడియాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య ఎంతో యాక్టివ్ గా ఉంటారు. స్నేహ రెడ్డి అల్లు కుటుంబానికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా,తన పిల్లలకు సంబంధించిన విషయాలను క్షణాలలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి సోషల్ మీడియాలో ఓ రేర్ ఫీట్ను అందుకున్నారు. ఇప్పటివరకు ఇండియాలోనే ఏ హీరో భార్యకు లేని ఫాలోయింగ్ స్నేహ రెడ్డికి ఉండటం విశేషం.తాజాగా స్నేహ రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య నాలుగు మిలియన్లకు చేరుకుంది. ఈ విధంగా ఫాలోవర్స్ ని సంపాదించుకున్న మొదటి వ్యక్తిగా స్నేహ రెడ్డి రికార్డును క్రియేట్ చేశారని చెప్పవచ్చు.
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ పాకిస్తాన్లోని కీలక అణు…