ప్రస్తుత కాలంలో స్టార్ హీరోలు, స్టార్ సెలబ్రెటీలు మాత్రమే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటమే కాకుండా వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూవారి కుటుంబానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ విధంగా సోషల్ మీడియాలో స్టార్ హీరోలైన మహేష్ బాబు, రామ్ చరణ్, బన్నీ వీరి సతీమణులు సోషల్ మీడియాలో యమ స్పీడ్ గా ఉంటారు.
మహేష్ బాబు భార్య నమ్రత ఒకప్పుడు హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే తన కుటుంబానికి సంబంధించిన విషయాలను మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన విషయాలను నమ్రత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన సైతం అపోలో సంస్థలకు సంబంధించిన విషయాలను, పలు ఆరోగ్య విషయాలను, అదే విధంగా తన భర్త రామ్ చరణ్ కి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. వీరిద్దరి కన్నా సోషల్ మీడియాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య ఎంతో యాక్టివ్ గా ఉంటారు. స్నేహ రెడ్డి అల్లు కుటుంబానికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా,తన పిల్లలకు సంబంధించిన విషయాలను క్షణాలలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి సోషల్ మీడియాలో ఓ రేర్ ఫీట్ను అందుకున్నారు. ఇప్పటివరకు ఇండియాలోనే ఏ హీరో భార్యకు లేని ఫాలోయింగ్ స్నేహ రెడ్డికి ఉండటం విశేషం.తాజాగా స్నేహ రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య నాలుగు మిలియన్లకు చేరుకుంది. ఈ విధంగా ఫాలోవర్స్ ని సంపాదించుకున్న మొదటి వ్యక్తిగా స్నేహ రెడ్డి రికార్డును క్రియేట్ చేశారని చెప్పవచ్చు.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…