అల్లు అరవింద్ కుమారుడిగా, స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ సోదరుడిగా, హీరోగా అల్లు శిరీష్ మనందరికీ సుపరిచితమే. తెలుగులో తక్కువ సినిమాలే తీసినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా అల్లు శిరీష్ తన అభిమానులకు షాక్ ఇచ్చాడు. కొద్దిరోజుల పాటు తాను సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని ప్రకటించాడు. ఇందుకు గల కారణాలు మాత్రం శిరీష్ వెల్లడించలేదు.

ఈ సంవత్సరం నవంబర్ 11వ తేదీ నా కెరీర్ లోనే బెస్ట్ డే అంటూ శిరీష్ చెబుతున్నాడు. అయితే ఇందుకు గల కారణాన్ని త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు అల్లు శిరీష్. తాజాగా ట్వీట్ చేస్తూ నా వృత్తిపరమైన జీవితంలో నవంబర్ 11వ తేదీ ఎంతో ఉత్తమమైన ఉత్తమమైన రోజు ఎందుకు? ఏమిటి? అన్న విషయాల గురించి త్వరలోనే మీతో షేర్ చేసుకుంటాను అని తెలిపారు.
కొన్ని కారణాలవల్ల సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి అనుకుంటున్నాను అని ట్వీట్ చేశారు. ఈ విషయంపై స్పందించిన పలువురు నెటిజన్లు అందుకు గల కారణం వెల్లడించాలని కామెంట్ చేశారు.ఒక నెటిజన్ అన్నా లవ్ సెట్ అయిందా..? పెళ్లి కుదిరిందా అనే ప్రశ్నించగా వృత్తిపరంగా స్పెషల్ డే అని మరీమరీ చెప్పాను స్వామీ అంటూ సరదాగా రిప్లై ఇచ్చారు.
ఏంటన్నా..హాలీవుడ్ కి వెళ్తున్నావా? అని మరో నెటిజన్ అడిగగా.. అలాంటి ఆశ, ఆశయాలు నాకు ఏమీ లేవు బ్రో, నా కొత్త సినిమా ఫిక్స్ అయ్యింది కథ నచ్చింది అనే ఆనందం. నా కెరీర్లో ఇది బెస్ట్ స్క్రిప్ట్ అవుతుందని ఆశ అంటూ అసలు నిజాలు బయట పెట్టాడు.































