Ameesha Patel: ఎన్టీఆర్ గురించి గొప్పగా ట్వీట్ చేసిన నటి… ట్రోల్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్.. అసలేమైందంటే?

Ameesha Patel: బాలీవుడ్ నటి అమీషా పటేల్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు తెలుగులో ఈమె బద్రి నాని నరసింహుడు వంటి సినిమాలలో నటించారు.ఈమె తెలుగులో నటించినది కొన్ని సినిమాలే అయినా ఈమెకు హిట్ ఇచ్చినది మాత్రం బద్రి సినిమా అని చెప్పాలి. ఇలా తెలుగులో నటించిన ఈమె అనంతరం తెలుగు తెరకు దూరమయ్యారు.

ఇకపోతే తాజాగా నటి అమీషా పటేల్ ఎన్టీఆర్ గురించి ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేశారు.2005 బి.గోపాల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ అమీషా పటేల్ సమీరారెడ్డి కాంబినేషన్లు నరసింహుడు అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అప్పట్లో డిజాస్టర్ సొంతం చేసుకుంది.ఇకపోతే తాజాగా అమీషా పటేల్ ఈ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి ఉన్నటువంటి ఒక రొమాంటిక్ ఫోటో ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

ఇలా ఈ ఫోటోని షేర్ చేస్తూ ఎన్టీఆర్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఎన్టీఆర్ అప్పట్లో సూపర్ సార్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఈయన ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. తారక్ లవ్లీ కో స్టార్… హార్డ్ వర్క్ స్టార్ అంటూ తన గురించి పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు.

Ameesha Patel: కొంచెం చూసుకోవాలి కదా మేడం…

ఈ విధంగా ఈమె ట్రీట్ చేస్తూ ఎన్టీఆర్ కు ట్యాగ్ చేయకుండా వేరే ఖాతాకు ట్యాగ్ చేశారు.ఇలా రెండుసార్లు ఈమె తప్పుగా ట్యాగ్ చేయడంతో ఎన్టీఆర్ అభిమానులు ఈమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఎన్టీఆర్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు అయితే ఒకసారి చూసుకోవాలి కదా ఎవరికీ ట్యాగ్ చేశారో అంటూ నటి అమీషా పటేల్ పై ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పిన చిన్న తప్పు వల్ల ట్రోలింగ్ కి గురయ్యారు.