Connect with us

Featured

Analyst Damu Balaji : పవన్ కళ్యాణ్ కి ఎన్పిడి రోగం ఉంది… డాక్టర్ రాజు రవితేజ సంచలన కామెంట్స్… ఆ రోగం లక్షణాలు ఏంటంటే…: అనలిస్ట్ దాముబాలాజీ

Published

on

Analyst Damu Balaji : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఆయనతో కలిసి దాదాపు 12 ఏళ్ళు ట్రావెల్ చేసిన డాక్టర్ రాజురవితేజ అనే వ్యక్తి ఇటీవల స్వప్న కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తీవ్ర ఆరోపణలను చేసారు. ఆయనకు ఎన్పిడి రోగం ఉందంటూ చెప్పారు. ఆయన నుండి ఎవరూ సంతోషంగా బయటికి రారని బాధతోనే ఇబ్బందితోనే బయటికి వస్తారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. అసలు ఏంటి ఎన్పిడి అంటే ఆ వ్యాధి లక్షణాలు ఏమిటి వంటి విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ వివరించారు.

సెల్ఫ్ లవ్ ఎక్కువైతే వచ్చేదే…

దాము బాలాజీ ఈ ఇష్యూ గురించి మాట్లాడుతూ ఎన్పిడి అంటే నేరసిషస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ అంటూ తెలిపారు. నేరసిషస్టిక్ అంటే తమని తాము ఇతరుల కన్నా గొప్ప వారిగా భావించడం ఇతరులను తక్కువగా చూడటం అంటూ వివరించారు. నార్సిసస్ అనే రాజు తనని తాను ఎక్కువ ఇష్టపడటం వల్ల చివరికి నీటిలో తన బింబాన్ని ప్రేమిస్తాడు. చనిపోయేవరకు అలాగే ఉన్న అతని పేరు మీదుగా ఈ వ్యాధి పేరు వచ్చింది అంటూ దాము బాలాజీ వివరించారు. ఫ్రెస్కో థియరీ ప్రకారం ఈ వ్యాధిలో రెండు స్టేజ్లు ఉంటాయి. మొదట తమని తాము ఇష్టపడటం ఇది చిన్నతనంలో పిల్లల్లో కలుగుతుంది. అద్దంలో వారిని వారే చూసి వింతగా ఫీల్ అవుతుంటారు. అయితే అది పెద్దయ్యాక పోతుంది. కానీ కొంతమందిలో నేనే గొప్ప ఇతరులు నా ముందు చిన్నవారు అనే భావన ఎక్కువగా కలుగుతుంది అది తీవ్రమైతే ఎన్పిడి వస్తుంది. దాము బాలాజీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ను నేను బాలు సినిమా షూటింగ్ సమయంలో కలిసినపుడు ఆయన కోసం షూటింగ్ లో అందరూ మూడు రోజులుగా ఎదురు చూస్తున్నట్లు తెలిసింది.

Advertisement

ఆయనను షూటింగ్ కి రండి అని చెప్పే ధైర్యం అక్కడ ఎవరికీ లేదు. ఇక ఆయన నటించేటపుడు సైలెంట్ గా ఉండాలి, ఆయన కంటికి ఎదురుగా మనుషులు గుంపులుగా కనిపించరాదు. డైరెక్టర్ కానీ, కెమెరా మెన్ కానీ యాక్షన్ అంటూ సౌండ్ చేయరాదు కేవలం చేతులను ఊపుతూ చేయాలి. ఇప్పుడు ఆ విధానం మారిందో లేదో తెలియదు కానీ అప్పట్లో అలా ఉండేది అంటూ చెప్పారు. ఇక రాజు రవితేజ చెప్పిన విషయాలను ఉదాహరిస్తూ ఆ వ్యాధి ప్రధాన లక్షణం సెల్ఫ్ లవ్ ఆలాగే ఇతరులను తన కంట్రోల్ లో పెట్టుకోవడం, అందుకే బహుశా పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.

Continue Reading
Advertisement

Featured

ITR FIling : గడువు పెంచలేదు.. ఫేక్ న్యూస్ నమ్మొద్దు.. “జూలై 31వ తేదీలోపు మీ ITR ఫైల్ చేయండి”.. కీలక ప్రకటన చేసిన ఐటీ శాఖ

Published

on

ITR ఫైలింగ్ : పన్ను చెల్లింపుదారులకు ముఖ్యమైన గమనిక. మీరు FY 2023-2024 కోసం మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఇంకా ఫైల్ చేయలేదా? ఆదాయపు పన్ను శాఖ మరో కీలక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 31లోగా ఐటీ రిటర్నులు సమర్పించాలని కోరింది ఐటీ శాఖ. మరో నెల రోజులు గడువు పెంపుపై వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలింది. పన్ను చెల్లింపుదారులు ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మవద్దని సోషల్ మీడియా ఎక్స్ లో సూచించింది.

గడువు 4 రోజులు మాత్రమే. జూలై 31వ తేదీలోపు ITR ఫైల్ చేయాలి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ వీలైనంత త్వరగా రిటర్నులు సమర్పించాలని ఐటీ శాఖ సూచించింది. పన్ను పోర్టల్ లో ఎటువంటి సాంకేతిక సమస్య లేదు. మీరు గడువు సమయంలోపు ITR ఫైల్ చేయకపోతే, మీరు సెక్షన్ 234A కింద వడ్డీని మరియు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 234F కింద జరిమానా చెల్లించవలసి ఉంటుంది.

మరోవైపు ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసి వాపసు కోరుతున్న వారిని కూడా ఐటీ శాఖ హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు ఫోన్లలో మెసేజ్ లు పంపుతూ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసిందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఇలాంటి ఫేక్ మెసేజ్‌లను చూసి మోసపోకండి మరియు రీఫండ్ కోసం మీ బ్యాంక్ ఖాతా వివరాలు మరియు వన్-టైమ్ పాస్‌వర్డ్‌లను అడుగుతూ మీకు కాల్ వస్తే అప్రమత్తంగా ఉండండి. అటువంటి లింక్‌లపై క్లిక్ చేయవద్దు. ఇప్పటి వరకు 5 కోట్ల మంది పన్ను రిటర్నులు దాఖలు చేసినట్లు గుర్తించింది. వీరిలో ఇప్పటికే 1.8 మిలియన్ల రిటర్న్‌లు ప్రాసెస్ చేయబడి, రీఫండ్ ఖాతాలకు జమ అయినట్లు కూడా తెలిపింది.

Advertisement

Continue Reading

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!