Analyst Damu Balaji : వైజాగ్ లో మరణించిన వివహిత శ్వేత ఆత్మహత్య వెనుక ఒక్కో చిక్కుముడి వీడుతున్నాయి. అయితే ఆమె మానసికంగా ఎంతో బాధపడటం వల్లే ఆత్మహత్య చేసుకుందనే విషయం స్పష్టం అవుతోంది. ఇప్పటివరకూ అత్తింటి వారి వేధింపులే కారణం అనుకుంటుండగా ఇప్పుడు భర్త మణికంఠ కి ఉన్న అఫైర్ కూడా కారణం అని తెలుస్తోంది. హైదరాబాద్ లో వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉన్న మణికంఠ పెళ్లి చేసుకున్న భార్య శ్వేతను నిర్లక్ష్యం చేసాడు. పెళ్ళైనా నాకేమి అభ్యంతరం లేదని ప్రియురాలు భరోసా ఇవ్వడంతో ఇక్కడ భార్యను తల్లిదండ్రుల వద్ద పెట్టి అక్కడ ప్రేయసితో హైదరాబాద్ లో ఉంటున్నాడు మణికంఠ అంటూ అనాలిస్ట్ దాము బాలాజీ వివరించారు.

శ్వేత మరణానికి మణికంఠ ఎఫైర్ కారణం…
శ్వేత అత్తింట్లో వేధింపుల గురించి తన భర్తతో చెప్పుకుంది. అయితే భర్త నుండి సరైన స్పందన లేకపోవడం, హైదరాబాద్ కి తీసుకెళ్లమని అడిగినా మణికంఠ తీసుకుని పోకుండా వైజాగ్ లో తల్లిదండ్రుల వద్ద ఉంచడం, గర్భిణీగా ఉన్న శ్వేతకు మరింత బాధ కలిగించింది అంటూ తెలిపారు బాలాజీ. గర్భిణీగా ఉన్న ఏ స్త్రీ అయినా భర్తతో ఉండాలని కోరుకుంటుంది. అలానే శ్వేత కూడా భావించినా మణికంఠ పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి నిర్ణయం తీసుకుంది.

అదీ కాక హైదరాబాద్ లో ఉన్న మణికంఠ ప్రేయసి కూడా శ్వేతకు ఫోన్ చేసి తిట్టడం వంటివి చేసిందని వార్తలు బయటికి వస్తున్నాయని తెలిపారు బాలాజీ. ఇవన్నీ శ్వేత మనసుని మరింత గాయపరిచి ఆత్మహత్య కు ప్రేరేపించి ఉండవచ్చని తెలిపారు. ఇక శ్వేత ఫోన్ డేటా ను ఫారెన్సిక్ వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఆ రిపోర్ట్స్ బయటికి వస్తే మరింత సమాచారం తెలుస్తుంది అంటూ అభిప్రాయపడ్డారు.































