Analyst Damu Balaji : తెలంగాణ ఎన్నికల్లో ఈసారి కెసిఆర్ ప్రభుత్వాన్ని కాదని తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. ఇక సీఎంగా రేవంత్ రెడ్డి తన పని తాను చేసుకుంటుండగా కెసిఆర్ అనారోగ్యంతో యశోధ హాస్పిటల్ లో చేరడం ఇపుడు తెలంగాణ రాష్ట్రంలో చర్చకు దారి తీసింది. రాజకీయ ప్రముఖులు, సన్నిహిత వర్గాలందరూ ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటుంటే చాలా మంది మాత్రం ఇదంతా కెసిఆర్ డ్రామా అంటూ కొట్టిపారేస్తున్నారు. ఇక అసలు ఇందులో ఉన్న నిజానిజాల గురించి అనలిస్ట్ దాము బాలాజీ ఆయన అభిప్రాయాలను పంచుకున్నారు.

కెసిఆర్ డ్రామా చేస్తున్నారా… లేక నిజమా…
అరవై ఏళ్లు పైబడిన కెసిఆర్ తాజాగా తన తుంటి ఎముక విరగడంతో యశోధ హాస్పిటల్ లో సర్జరీ చేయించుకున్నారు. కోలుకోవడానికి కొన్ని వారాల సమయం పడుతుందని వైద్యులు చెబుతుండగా ఇదంతా అసెంబ్లీకి రాకుండా కెసిఆర్ ఆడుతున్న డ్రామా అంటూ అవినీతి కేసుల్లో జైలుకి వెళ్లాల్సి వస్తుందని ఇలా చేస్తున్నాడంటూ అనేక రకాల కామెంట్స్ వినిపిస్తున్న సమయంలో బాలాజీ మాట్లాడుతూ ఆయనకు డ్రామా చేయాల్సిన పనిలేదని, సుధీర్ఘ రాజకీయ అనుభవంలో ఎన్నో ఒడిదుడుకులను చూసిన ఆయన ప్రతిపక్షంలో ఉండటానికి భయపడే రకం కదంటూ అభిప్రాయపడ్డారు.

ఇక ఆయన నిజంగా డ్రామా చేసుంటే సీఎం రేవంత్ రెడ్డి ఆరోగ్య కార్యదర్శిని పంపి ఆయనకు భద్రత కల్పించాలని ఎందుకు చెప్తారు అంటూ బాలాజీ వివరించారు. ఇక నెటిజన్స్ చేస్తున్న ట్రోల్స్ గురించి మాట్లాడుతూ కెసిఆర్ మీద తెలంగాణ సమాజంలో ఉన్న వ్యతిరేకత ఇలా బయటపడుతోందని చెప్పారు



































