Analyst Damu Balaji : తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఇటు ఆంధ్ర రాజకీయాల మీద పడింది. తెలంగాణలో రెండు పర్యాయాలు గెలిచినా కెసిఆర్ జనాల నుండి వ్యతిరేకత ఎదుర్కొని ఓటమి చూసారు. ఆయన అతి విశ్వాసం, అహంకారం ఆయనను దెబ్బతీశాయనే అభిప్రాయాల నడుమ ఏపీ లో కూడా ఫలితం మారబోతోందని, జగన్ పాలన పట్ల వ్యతిరేకత మొదలైందని ప్రతిపక్షాల విమర్శలు మొదలయ్యాయి. అయితే తాజాగా జగన్ గూటి నుండి నలభై మంది ఎమ్మెల్యేలు బయటికి వస్తున్నట్లు కథనాలు రావడం గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

సంక్షోభంలో జగన్ సర్కార్…
జగన్ ఈ మధ్య కాలంలో దాదాపు పది నివేదికలను తయారు చెయంచుకుని ప్రజా తీర్పు ఎలా ఉండబోతోంది, ఏ ఏ ఎమ్మెల్యేల పనితీరు పట్ల జనాల్లో వ్యతిరేకత ఉంది అనే విషయాలను సుధీర్ఘంగా చర్చిస్తున్నట్లు తెలిపారు బాలాజీ. ఇక ఇదివరకే శ్రీదేవి వంటి వారు జగన్ టికెట్ ఇవ్వలేనని చెప్పడంతో పార్టీ నుండి వెళ్లిపోయారు. ఆమె బాటలోనే మరో ముగ్గురు వెళ్లిపోయారు.

ఎమ్మెల్యేల మీద నిఘా ఉంచిన జగన్ వారి పట్ల, వారి నియోజకవర్గంలో ఉన్న ఇమేజ్ ను బట్టే టికెట్ ఇస్తానని ఖచ్చితంగా చెప్పడం, ఎమ్మెల్యే టికెట్ కాకుండా వారికి పార్టీ పరంగా వేరే ఏదైనా సహాయం చేస్తానని చెప్పడంతో ఇపుడు తాజాగా నలభై నుండి యాభై మంది ఎమ్మెల్యేలు పార్టీ నుండి బయటికి వచ్చేస్తున్నారు అనే టాక్ వినిపిస్తోందని బాలాజీ తెలిపారు.


































