Analyst Damu Balaji : వివేకానంద కేసులో ఊహకందని మలుపులు అలాగే డైలీ సీరియల్ ను తలపించేలా కొత్త వ్యక్తులు వస్తూనే ఉన్నారు. తాజాగా సుప్రీం కోర్టుకు చేరిన ఈ హత్య కేసులో సిబిఐ సీల్డ్ కవర్ లో కొన్ని కీలక ఆధారాలను కోర్టుకు సమర్పించబోతోంది అనే వార్తలను నడుమ జగన్ కు ఈ కేసులో చుక్కెదురు కాబోతోందా అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీటి మీద అనలిస్ట్ బాలాజీ ఆయన విశ్లేషణ అందించారు.

సుప్రీం కోర్టులో ఏం జరగనుంది…
సిబిఐ ఇప్పటికే గడువు తీసుకుని తన విచారించిన విషయాలను సీల్డ్ కవర్ లో అందిస్తానని న్యాయ స్థానం ఎదుట చెప్పింది. మరోవైపు సునీత అవినాష్ రెడ్డి బెయిల్ విషయంలో సుప్రీం కోర్ట్ తలుపు తట్టడంతో ఆ బెయిల్ పిటిషన్ విచారణ జులై 3 న ఉండనుండటంతో అదే రోజు సిబిఐ కూడా తన విచారణ పత్రాలను మొత్తం కోర్ట్ ముందు పెట్టొచ్చని బాలాజీ తెలిపారు.

ఇక కేసులో మరో ఇద్దరు కొత్త వ్యక్తులను ముద్దాయిలుగా చేర్చుతోంది సిబిఐ అనే మాట వినిపిస్తోంది. జగన్, ఆయన సతీమణి భారతి పేర్లు కొన్ని మీడియా వర్గాలు సిబిఐ సీల్డ్ కవరర్లో ఉండొచ్చని చెబుతుండగా ఒకవేళ ఉన్న ఆ పేర్లు బయటికి రాకుండా విచారణ జరపాలని సిబిఐ భావిస్తున్నట్లు బాలాజీ అభిప్రాయపడ్డారు. అందుకే కోర్ట్ కి సీల్డ్ కవర్ లో విచారణ పత్రాలను అందిస్తున్నట్లు తెలిపారు.






























