Analyst Damu Balaji : తెలుగులో సావిత్రి గారి తరువాత సహజ నటి అంటే సౌందర్య గుర్తొస్తారు. తెలుగులో హీరోయిన్ గా చిన్న సినిమాలతో మొదలయిన ఆమె సినిమా ప్రస్థానం అగ్ర హీరోలందరి సరసనా నటించి హీరోకి సమానమైన స్టేటస్ ను అందుకున్న హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి సౌందర్య గారు పెళ్ళైన కొద్ది కాలానికే రాజకీయ ప్రచారం కోసం వెళుతూ బెంగళూరులో హెలీకాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆమె మరణించిన ఇన్నేళ్లకు మళ్ళీ ఆమె మరణం సహజ మరణమా లేక గిట్టని వారు చేసినదా అనే అనుమానలు రికేత్తుతున్నాయి అంటూ అనలిస్ట్ దాము బాలాజీ అభిప్రాయపడుతున్నారు.

సౌందర్య డెత్ మిస్ట్రీ ఏంటి…
బిజేపీ ప్రచారం కార్యక్రమాలకు హాజరవుతూ హెలీకాప్టర్ ప్రమాదంలో మరణించిన సౌందర్య గారు మరణించాక ఆమెతో పాటు తన అన్న మరణించడం వల్ల ఆయన భార్య అలాగే సౌందర్య మరో సోదరుడు రఘు ఇద్దరూ సౌందర్య ఆస్తి విషయంలో కోర్ట్ ను ఆశ్రయించవలసి వచ్చింది.

సౌందర్య అన్న భార్య నిర్మల అలాగే రఘు ఇద్దరూ ఆస్తి కోసం కోర్ట్ మెట్లెక్కినపుడు సౌందర్య ఆస్తి కోసం రఘునే హత్య చేయించాడు అనే పుకార్లు బాగా వినిపించయంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. అయితే అవన్నీ వదంతులే కానీ ఆమెది సహజ మరణం అంటూ ఆయన అభిప్రాయపడ్డారు. హీరోయిన్ ప్రేమ ఒక ఇంటర్వ్యూలో చెబుతూ సౌందర్య తనకు మంచి మిత్రురాలని, తన మరణం బాగా కలచివేసిందని తెలిపారు. ఆమె మరణించినపుడు చూడ్డానికి వెళితే ఆమె శరీరం మాత్రమే ఉంది కానీ తల లేదు, ఆమె దేహాన్ని కూడా వాచ్మ్యాన్ సహాయంతో గుర్తు పట్టారు అంటూ తెలిపారు. ఇక ఈ విషయాల గురించి దాము బాలాజీ మాట్లాడుతూ ఆమెది సహజ మరణమే అయినా ఆస్తి విషయంలో కుటుంబం సభ్యులు గొడవ పడటం వల్ల వదంతులు వినిపించాయని తెలిపారు.
































