బుల్లితెరపై టాప్ యాంకర్లలో ఒకరిగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన యాంకరింగ్ మాత్రమే కాకుండా నటన ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని సినిమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు అనసూయ.ప్రస్తుతం ఈమె బుల్లితెరపై కంటే వెండితెరపై ఎంతో బిజీగా ఉన్నారు. ఈ విధంగా తన కెరియర్ లో ఎంతో బిజీగా ఉన్న అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.
నిత్యం సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ విధంగా అనసూయ ఫోటోలు, వీడియోలు క్షణాల్లో వైరల్ గా మారుతుంటాయి. ఈ క్రమంలోనే కొన్నిసార్లు ఈమె ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. తాజాగా అనసూయ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో షేర్ చేసిన అనసూయను నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.
తాజాగా అనసూయ షేర్ చేసిన వీడియోలో లేజీ డే అంటూ బెడ్ పై పెరుగు తాగుతున్నటువంటి ఒక వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో తన కొడుకుతో పాటు తను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తన పెట్ కూడా ఉంది. అయితే ఆ పెట్ పెరుగు తాగడానికి అనసూయ దగ్గరకు వస్తుండగా అలా చేయకు అగ్రెసివ్గా ఉంటావు, అయినా ఇది పెరుగు అంటూ తన పెట్ కి చెబుతోంది.
ఈ క్రమంలోనే అనసూయ పక్కన ఉన్నటువంటి తన కొడుకు వెంటనే అనసూయను పెరుగు అంటే ఏంటమ్మా అని అడగగా వెంటనే అనసూయ హిందీలో దహీ అని చెబుతున్న వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ వీడియో చూసిన నెటిజన్లు తెలుగు యాంకర్ అయ్యుండి కూడా పిల్లలకు తెలుగు నేర్పించకపోవడం చాలా విడ్డూరం.. అంత పెద్ద అబ్బాయికి పెరుగు అంటే తెలియకపోవడం దారుణం అంటూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ పాకిస్తాన్లోని కీలక అణు…