Anasuya: యాంకర్ అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే ఈమె ప్రస్తుతం తన భర్తతో కలిసి బ్యాంకాక్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా బ్యాంకాక్ పర్యటనలో ఉన్నటువంటి అనసూయ తరచు తన వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఇక అనసూయ జూన్ 4వ తేదీ వారి పెళ్లి రోజు కావడంతో తన భర్తతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన భర్త పై ఉన్నటువంటి ప్రేమను తెలుపుతూ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈమె ఇంస్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ నువ్వు నాకు మొదటిసారి ఇచ్చిన ప్రేమలేఖ ఇప్పటికీ గుర్తుంది. న్యూఢిల్లీ ఆడిటోరియంలో నాకు ఆ ప్రేమ లేక ఇచ్చావు బహుశా ఇప్పటివరకు నేను రిప్లై ఇవ్వలేదు.
ఈరోజు ఇలా రిప్లై ఇస్తున్నానంటూ ఈమె ఒక సుదీర్ఘమైన పోస్ట్ రాసుకోచ్చారు. ఇన్ని రోజులు నా జీవితంలో ఎంతో సంతోషాన్ని నింపినందుకు ధన్యవాదాలు. నాకోసం చాలా త్యాగాలు చేశావు. ఎన్ని అవమానాలు ఎదురైనా.. మన ప్రేమ దేవాలయానికి నువ్వు ఓ పిల్లర్లాగా నిలిచావు. ఇప్పుడు మనం కలిసి ఎదుగుతున్నాం. ఇన్నేళ్లు నువ్వు నన్ను ఎలా భరించావో నాకు తెలియడం లేదు. నేను కూడా నిన్ను ఎలా భరించానో అర్థం కావడం లేదు.
మనిద్దరం పర్ఫెక్ట్ జంట కాదని నాకు తెలుసు మనిద్దరం చాలా మూర్ఖులం.కొన్నిసార్లు ఒకరి పట్ల మరొకరు చాలా దారుణంగా ఉన్నాము అలాగే కొన్ని సమయాలలో ఒకరి కోసం ఒకరు నిలబడలేకపోయాం. మన పెళ్లిని ఓ డేటింగ్ లాగా చేసిన నీకు థ్యాంక్స్. పెళ్లి రోజు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. ఈ పోస్టులో ఓ వీడియో ఆమె షేర్ చేశారు. ఇలా అనసూయ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన అన్నమయ్య జిల్లా ఘటనకు మరో కీలక మలుపు తిరిగింది. మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై దారుణానికి పాల్పడ్డాడని…
ఉదయం లేవగానే శరీరం తేలికగా అనిపించకపోతే రోజంతా ఏదో భారంగా ఉంటుంది. మలబద్ధకం సమస్య చాలా మందిని వేధిస్తున్న సాధారణ…
భారతదేశంలో ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన నగరాల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకొచ్చేది కాశీ. వేల ఏళ్ల చరిత్ర, అనేక పురాణ…
ఇటీవల కాలంలో ఫిట్నెస్పై ఆసక్తి గణనీయంగా పెరిగింది. జిమ్లకు వెళ్లేవారు మాత్రమే కాదు, బరువు తగ్గాలని భావించే వారు కూడా…
ఉదయం టీతో రెండు బిస్కెట్లు, సాయంత్రం కాఫీకి మరికొన్ని – ఇది చాలామందికి రోజువారీ అలవాటు. పిల్లలకు టిఫిన్ బాక్స్లో…
దేశవ్యాప్తంగా ఆధార్ సేవలను మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన కొత్త మొబైల్ యాప్కు ప్రజల నుంచి విశేష స్పందన…