Anasuya: బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఈ సినిమాతో ఈమెకు మంచి గుర్తింపు రావడంతో తనకు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇలా వరుస సినిమాలు వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా గడుపుతున్న అనసూయ తనకు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టిన జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పారు.
ఈ కార్యక్రమం నుంచి ఈమె దూరమైన అనంతరం పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ ఇండస్ట్రీలో హీరోయిన్స్ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే కెమెరా ముందు నిలబడి కాపాడండి అని అరవడం లేదా సిగ్గుపడుతూ నవ్వాలి. హీరోయిన్లకు ఇంతకుమించి మరేం పని లేదంటూ ఈమె కామెంట్ చేశారు.
ఇక ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఏమాత్రం ప్రాధాన్యత లేదంటూ ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇండస్ట్రీలో హీరోయిన్స్ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే పోకిరి సినిమాలో గిల్లితే గిల్లిచ్చుకోవాలి అనే డైలాగ్ ఉంది కదా ఇండస్ట్రీలో కూడా హీరోయిన్స్ పరిస్థితి అలాగే ఉంటుందని ఈమె తెలిపారు.ఇక హీరోయిన్స్ హక్కుల గురించి మాట్లాడితే వారిపై ఇంట్రెస్ట్ తగ్గిపోతుందని వారికి ఎలాంటి అవకాశాలు ఉండవని ఈమె తెలిపారు.
ఇండస్ట్రీలో హీరోయిన్స్ కేవలం ఒక దేవదాసీలా మాత్రమే పనిచేయాలని కోరుకుంటారు. ఇలా అనుకోవడం పూర్తిగా తప్పు అంటూ ఈ సందర్భంగా అనసూయ ఇండస్ట్రీలో హీరోయిన్స్ గురించి వారికి ఏ విధమైనటువంటి విలువ లేదంటూ ఈ సందర్భంగా ఆమె ఈ విషయం గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. మొత్తానికి అనసూయ ఇండస్ట్రీలో హీరోయిన్ల గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మన శరీరంలో కిడ్నీలు అత్యంత ముఖ్యమైన అవయవాలు. ఇవి రక్తంలో ఉన్న వ్యర్థాలను తొలగించడమే కాకుండా, శరీరంలో ద్రవాల సమతుల్యతను…
వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కొన్ని మార్పులు సహజమే. అయితే ఇటీవల చాలా మందిలో కనిపిస్తున్న ఒక సమస్య నిపుణులను…
మన రోజువారీ వంటకాలలో నూనెకు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు దాదాపు ప్రతి…
మన దేశంలో చిన్నపిల్లల్లో తరచుగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత ఒకటి. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లల్లో, అలాగే రెండు సంవత్సరాల…
2026 ఏప్రిల్ 15 బుధవారం రోజుకు సంబంధించిన రాశి ఫలితాలు ఈ రోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి…
గుజరాత్లోని సారంగపుర్ ప్రాంతంలో వెలసిన కష్టభంజన్ దేవ్ హనుమాన్ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి క్షేత్రాల్లో ఒకటి. భక్తులు…