Anchor Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈమె లైగర్ సినిమాని ఉద్దేశిస్తూ చేసిన పరోక్ష ట్వీట్ ఇందుకు కారణం అని తెలుస్తుంది.ఈమె కర్మ సిద్ధాంత ఫలితం ఇప్పుడు కాకపోయినా మరి కాస్త ఆలస్యంగా అయినా రావచ్చు రావడం మాత్రం పక్కా అంటూ చేసిన ట్వీట్ విజయ్ దేవరకొండను ఉద్దేశించి చేశారని అభిమానులు రెచ్చిపోయారు.
ఈ విధంగా అనసూయ ఒక్క ట్వీట్ చేయడంతో నేటిజెన్లు ఈమెపై పెద్ద ఎత్తున ట్వీట్స్ చేస్తూ తనని దారుణంగా ట్రోల్ చేశారు. కొందరు తనని ఏజ్ బాడీ షేమింగ్ చేస్తూ తనని ఆంటీ అంటూ ట్రోల్ చేశారు.ఈ క్రమంలోనే ఈ విషయంపై స్పందించిన అనసూయ గట్టిగా తనని విమర్శించిన వారికి వార్నింగ్ ఇస్తూ తనపై ఇలాంటి విమర్శలకు పాల్పడిన వారి మీద పోలీసు కేసు కూడా పెట్టారు.
నా ఆత్మగౌరవం కాపాడుకోవటం కోసం తాను ఎక్కడి వరకు అయినా వెళ్తానని,తనని విమర్శించిన వారికి సంబంధించిన ప్రతి ఒక్క స్క్రీన్ షాట్ నా దగ్గర ఉందని ఆధారాలతో సహా వాటిని బయటపెట్టి తప్పకుండా చర్యలు తీసుకొనేలా చేస్తానని వార్నింగ్ ఇచ్చారు.అలాగే నా కెరియర్ ను దెబ్బ కొట్టాలని కొందరు చూస్తున్నారని అలాంటి వారిని కూడా అసలు వదిలిపెట్టనంటూ ఈ సందర్భంగా అనసూయ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అయితే అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలు చూస్తుంటే కొందరు ఉద్దేశపూర్వకంగానే తన ఎదుగుదలను ఓర్వలేక ఇలా చేస్తున్నారా ఈమె వెనక ఇంత కుట్ర జరుగుతుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి అనసూయ తనని విమర్శించిన వారిపై చర్యలు తీసుకునే వరకు తన పంతం వదులుకోదని తెలుస్తోంది. మరి ఈ వివాదంలో ఎవరు నెగ్గుతారో లేచి చూడాలి.
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ పాకిస్తాన్లోని కీలక అణు…