Anchor Anasuya: అనసూయ భరద్వాజ్ ఈ పేరు గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో యాంకర్ గా తన కెరియర్ ప్రారంభించి అనంతరం సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్న అనసూయ పూర్తిగా బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెప్పారు. వరుస సినిమా షూటింగ్ లతో ఎంతో బిజీగా ఉన్న అనసూయ గత కొన్ని రోజుల నుంచి అమెరికాలో ఉంటున్న విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే అమెరికా వీధులలో చక్కర్లు కొడుతూ ఫోటోలు దిగడం ఆ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడం చేస్తున్నారు.ఈ క్రమంలోనే అనసూయ దీపావళి పండుగను కూడా తన కుటుంబానికి దూరంగా ఉండి అమెరికాలో తన స్నేహితులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు.ఇకపోతే అనసూయ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వ్యక్తితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు.
ఈ క్రమంలోనే అనసూయతో కలిసి ఫోటో దిగిన ఆ వ్యక్తి ఎవరు అనసూయతో అంత క్లోజ్ గా ఉండడంతో అతనికి అనసూయ ఏమవుతుంది అనే విషయం గురించి పెద్ద ఎత్తున నేటిజన్లు ఆరాతీస్తున్నారు. ఈ క్రమంలోనే అనసూయ ఆ వ్యక్తితో ఫోటో దిగడమే కాకుండా అతనిని ఉద్దేశిస్తూ నా సంరక్షకుడు.. స్నేహితుడు నేను జెర్రీ అయితే అతను టామ్.హ్యాపీ బర్త్డే అంటూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా తన పేరు ఉజ్వల్ అని చెప్పుకొచ్చారు.
ఇక ఈయన కూడా సినీ పరిశ్రమకు చెందిన వారే. ఉజ్వల్ అడవి శేషు దర్శకత్వంలో తెరకెక్కిన కిస్ అనే సినిమాలో హీరోగా నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినప్పటికీ విడుదలకు నోచుకోలేదు. ఇలా ఒక సినిమాలో హీరోగా నటించిన ఉజ్వల్ మరే ఇతర సినిమాలలోను నటించలేదు. అయితే ప్రస్తుతం ఆయన అమెరికాలో నివసిస్తున్నారు. ఇలా తన స్నేహితుడు అని అనసూయ చెప్పడంతో వీరిద్దరి మధ్య పరిచయం ఎలా ఏర్పడిందనే విషయం గురించి ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఈ ఫోటో వైరల్ గా మారింది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…