హైదరాబాద్ లో కరోనా వైరస్ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. మొన్ననే చెన్నయ్ కి చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగికి హైదేరాబద్ లో వైరస్ గుర్తించిన సంగతి తెలిసిందే.. ఇతను చెన్నై నుంచి హైదరాబాద్ కు బస్సులో వచ్చాడు.. తాజాగా మరో ఇద్దరికీ ఈ వ్యాధి సోకినట్టు తెలుస్తోంది. ఇందులో ఒకరు మైండ్స్పేస్ బిల్డింగ్ నంబర్ 20 లో డిఎస్ఎమ్ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగి పరిమళగా అనుమానిస్తున్నారు. రెండు వారాల క్రితం ఈమె ఇటలీ వెళ్లి వచ్చినట్టుగా తెలుస్తోంది.

దీనితో ఆ సంస్థతో పాటుగా మైండ్స్పేస్ లోని మిగిలిన సంస్థలు కూడా తమ ఉద్యోగులను ఇంటికి పంపించేశారు. మరి కొన్ని సంస్థలు కూడా తమ కార్యకలాపాలను మూసివేసినట్టు తెలుస్తోంది. పలు కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనీ ఆదేశించాయి. దీనితో కోవిడ్ 19 దెబ్బకు నిత్యం రద్దీగా ఉండే మైండ్స్పేస్ ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారిపోయింది.

మరో పక్క ఆమెతో పాటు పని చేసే సహోద్యోగుల్లో ఆందోళన మొదలైంది. దీనితో ఈ లక్షణాలు ఉన్న టెకీలు గాంధీ ఆసుపత్రి బాట పట్టారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్టు సమాచారం. బాధితుల్లో 16 మంది ఇటలీ కి చెందిన వారే. వీరంతా భారత పర్యటనలో ఉన్నారు.

కరోనా కారణంగా హొలీ వేడుకలకు దూరంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు కేంద్ర మంత్రులు నిర్ణయించారు. మరోవైపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి కి ప్రత్నామ్నాయంగా మరో ఆసుపత్రిని నిర్మించాలని తెలంగాణ సర్కార్ యోచిస్తోంది.

































