Anushka: సూపర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన అందాల నటి అనుష్క శెట్టి ఆ తర్వాత నటించిన విక్రమార్కుడు సినిమా ద్వారా హీరోయిన్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అలాగే అనుష్క నటించిన అరుంధతి సినిమా ఆమె సినీ కెరీర్ ని మలుపు తిప్పింది. ఆ సినిమాతో అనుష్క స్టార్ హీరోయిన్ జాబితాలోకి చేరిపోయింది. ఇక అప్పటినుండి తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో స్టార్ హీరోల సరసన నటిస్తూ అనుష్క సందడి చేసింది. ఇక రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమాతో అనుష్క పాన్ ఇండియా హీరోయిన్గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.
అనుష్క- ప్రభాస్ జోడి చాలా చూడముచ్చటగా ఉంటుంది. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలన్ని కూడా మంచి హిట్ అందుకున్నాయి. అందువల్ల వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు గతంలో ఎన్నో వార్తలు కూడా వినిపించాయి. అయితే వారిద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రభాస్ తో స్నేహం కోసం సినిమాలనే వదిలేస్తానని అనుష్క ఒక టీవీ షోలో చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ గా కూడా మారాయి. ఇంత క్లోజ్ గా ఉన్న వీరి ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటారు.అలాగే సినిమాల విషయంలో కూడా ఒకరికొకరు సహాయం చేసుకునేవారు.
ఈ క్రమంలో అనుష్కని ఒక సినిమాలో ఒక సినిమాలో నటించవద్దని ప్రభాస్ వారించినా కూడా ఆమె వినకుండా ఆ సినిమాలో నటించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ సినిమా ఏమిటో కాదు అల్లు అర్జున్, మంచు మనోజ్ కలిసి నటించిన వేదం. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అనుష్క ఒక వేశ్య పాత్రలో నటించింది . ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి మంచి అవకాశాలు అందుకుంటున్న సమయంలో అనుష్క అలాంటి పాత్రలో నటిస్తానని చెప్పినప్పుడు ప్రభాస్ వద్దని వారించాడు. అలాంటి పాత్రలలో నటిస్తే తనకున్న ఇమేజ్ పాడవుతుందని చెప్పినా కూడా అనుష్కకి ఆ పాత్ర నచ్చటంతో వేదం సినిమాలో నటించినట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…