Ap Food commision chairman Prathap Reddy : ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా అవినీతిపరులకు సింహ స్వప్నంలా పనిచేస్తున్న విజయ్ ప్రతాప్ రెడ్డి గారు సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి బాగా తెలుసు. పలు పాఠశాలలో తనిఖీలను నిర్వహిస్తూ నాణ్యత ప్రమాణాలను పాటించని వాటిమీద చర్యలను తీసుకుంటూ నిజాయితీకి మారుపేరు, ఒక ప్రభుత్వం ఉద్యోగి ఈయన లాగా పనిచేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేలా ఉండే విజయ ప్రతాప్ రెడ్డి గారి మీద టీడీపీ నేత లోకేష్ గారు పాదయాత్రలో అవినీతి ఆరోపణలను చేసారు. ఆయన భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించడంతో ప్రతాప్ రెడ్డి అందుకు కౌంటర్ వేశారు.

నిరూపిస్తే ఊరు విడిచి పోతా…
ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ గా ఉంటూ మంచి పేరు ఉన్న ప్రతాప్ రెడ్డి గారి మీద టీడీపీ నేత నారా లోకేష్ బద్వేల్ పాదయాత్రలో జూన్ 12 వ తేదీన నిర్వహించిన బహిరంగ సభలో అవినీతి ఆరోపణలను చేసారు. లోకేష్ గారు మాట్లాడుతూ రంగసముద్రం అనే ఊరి వద్ద చెరువు సమీపంలో ప్రతాప్ రెడ్డి ఆయన మనుషులు బినామీ పేరుతో భూ కబ్జాలకు పాల్పడ్డారని, యుట్యూబ్ లో నీతులు చెబుతూ బయట చేసేది అవినీతి పనులంటూ విమర్శించారు. రంగసముద్రం సర్వే నెంబర్ 1289లో 11 ఎకరాలు , సర్వే నెంబర్ 1094, 1076-1a లో బినామి పేరుతో కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అలాగే రంగసముద్రం చెరువు వద్ద కూడా సర్వే నెంబర్ 916 లో 24 ఎకరాలు, అలాగే రెవిన్యూ భూమి సర్వే నెంబర్ 1095 లో 21 ఎకరాలు, సర్వే నెంబర్ 1095/3 మూడు ఎకరాల భూమిని నకిలీ పత్రాలతో కాజేసారని ఆరోపించారు.

ఇక ఈ ఆరోపణల మీద ప్రతాప్ రెడ్డి గారు స్పందిస్తూ లోకేష్ నిజాలను తెలుసుకోకుండా పేపర్ లో రాసుకొచ్చింది చదివేసాడు. పప్పు అని లోకేష్ ని ఎందుకంటారో ఇప్పుడు తెలుస్తోంది అంటూ మాట్లాడారు. తాను నిజాయితీగా పిల్లలు గర్భవతులు సంపూర్ణ నాణ్యత గల ఆహరం తినాలని కోరుకుంటూ అందుకోసం కష్టపడి పనిచేస్తున్నాను. నాలాంటి నిజాయితీ గల ఆఫీసర్ మీద బురద జల్లడం ఏమిటి అంటూ నిరూపిస్తే ఊరు వదిలి వెళ్ళిపోతానంటూ చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి తప్పు ఎవరు చేసినా పార్టీ ఏదైనా చర్యలు తీసుకోమని స్వేచ్చ ఇవ్వడం వల్లే ఏ అడ్డంకులు లేకుండా పనిచేస్తున్నట్లు తెలిపారు.



































