AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు సంచలనంగానే ఉంటాయి. గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే 5000 గౌరవ వేతనంతో వాలంటీర్లు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా మారారు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ ఫలాలు అన్నింటిని స్వయంగా ప్రజల ఇంటి ముంగిటకు తీసుకువెళ్లారు.
ఇలా వీరి సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వీరికి 5 వేల రూపాయల గౌరవ వేతనం అందించారు. అయితే మొదట్లో ఈ వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు తిరిగి ఎన్నికల సమయానికి తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని తెలిపారు. అంతేకాకుండా వాలంటీర్లకు 10,000 రూపాయల గౌరవ వేతనం అందించబోతున్నట్లు ఈయన వెల్లడించారు.
ఈ విధంగా చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేక పోతున్నారని వాలంటీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో వాలంటీర్ వ్యవస్థ గురించి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని మమ్మల్ని మీరే ఆదుకోవాలి అంటూ చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ను కోరుతూ ఆందోళనలు చేపట్టారు.
ఎన్నికల హామీలలో భాగంగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ పదివేల రూపాయల వేతనం చెల్లించాలని తెలిపారు.. దయచేసి మాపై రాజకీయ రంగు పూయకండి మేము ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ అధికారుల ఆదేశాలను పాటిస్తామని మాపై మానవతా దృక్పథంతో ఆలోచించి తక్షణమే మమ్మల్ని విధులలోకి తీసుకోవాలని వాలంటీర్లు ఆందోళన చేశారు. అయితే గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను రెన్యువల్ చేయలేదని ఇకపై వాలంటీర్ వ్యవస్థ ఉండదనే ఉద్దేశంతోనే ప్రస్తుత అధికార నేతలు మంత్రులు వెల్లడిస్తున్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…