Political News

AP Politics: మాపై రాజకీయ రంగు పూయకండి.. మమ్మల్ని ఆదుకోండి…ఆందోళన చేస్తున్న వాలంటీర్లు!

AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు సంచలనంగానే ఉంటాయి. గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే 5000 గౌరవ వేతనంతో వాలంటీర్లు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా మారారు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ ఫలాలు అన్నింటిని స్వయంగా ప్రజల ఇంటి ముంగిటకు తీసుకువెళ్లారు.

ఇలా వీరి సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వీరికి 5 వేల రూపాయల గౌరవ వేతనం అందించారు. అయితే మొదట్లో ఈ వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు తిరిగి ఎన్నికల సమయానికి తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని తెలిపారు. అంతేకాకుండా వాలంటీర్లకు 10,000 రూపాయల గౌరవ వేతనం అందించబోతున్నట్లు ఈయన వెల్లడించారు.

ఈ విధంగా చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేక పోతున్నారని వాలంటీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో వాలంటీర్ వ్యవస్థ గురించి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని మమ్మల్ని మీరే ఆదుకోవాలి అంటూ చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ను కోరుతూ ఆందోళనలు చేపట్టారు.

AP Politics: విధులలోకి తీసుకోండి..

ఎన్నికల హామీలలో భాగంగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ పదివేల రూపాయల వేతనం చెల్లించాలని తెలిపారు.. దయచేసి మాపై రాజకీయ రంగు పూయకండి మేము ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ అధికారుల ఆదేశాలను పాటిస్తామని మాపై మానవతా దృక్పథంతో ఆలోచించి తక్షణమే మమ్మల్ని విధులలోకి తీసుకోవాలని వాలంటీర్లు ఆందోళన చేశారు. అయితే గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను రెన్యువల్ చేయలేదని ఇకపై వాలంటీర్ వ్యవస్థ ఉండదనే ఉద్దేశంతోనే ప్రస్తుత అధికార నేతలు మంత్రులు వెల్లడిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పనిమనిషి పుట్టినరోజు… యజమాని సర్‌ప్రైజ్‌తో కన్నీళ్లు ఆనందంగా మారిన క్షణం

సామాజిక మాధ్యమాల్లో అప్పుడప్పుడు కనిపించే కొన్ని సంఘటనలు మనసును హత్తుకుంటాయి. తాజాగా అలాంటి ఓ మధుర ఘటన నెటిజన్ల హృదయాలను…

3 minutes ago

హర్మూజ్ దాటి భారత్ వైపు భారీ ఎల్పీజీ ట్యాంకర్.. ఊరటలో దేశం..!

పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత్‌కు ఒక కీలక ఊరట లభించింది. దేశానికి అవసరమైన వంటగ్యాస్ సరఫరాలో…

7 minutes ago

హైదరాబాద్‌లో కల్తీ మామిడి పండ్ల దందా బహిర్గతం.. 200 కిలోలు సీజ్..!

వేసవి కాలం రాగానే మార్కెట్‌లలో మామిడి పండ్ల రద్దీ పెరుగుతుంది. అయితే ఈ డిమాండ్‌ను అవకాశంగా తీసుకుని కొందరు వ్యాపారులు…

1 hour ago

కన్న తండ్రే కిరాతకుడు.. ఇద్దరు చిన్నారుల ప్రాణాలు బలి

కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక హృదయవిదారక ఘటన సమాజాన్ని కలచివేసింది. పసిపాపల నవ్వులతో కళకళలాడాల్సిన ఓ ఇల్లు ఒక్కసారిగా విషాదంలో…

1 hour ago

ఢిల్లీలో భూకంపం షాక్.. రాత్రివేళ పరుగులు తీసిన ప్రజలు

దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా భూమి కంపించడం ప్రజల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. కొద్ది సెకన్ల పాటు…

2 hours ago

శ్రీకాకుళంలో కలకలం.. బాదం పాలు తాగి 80 మంది అస్వస్థత

శ్రీకాకుళం జిల్లాలో ఒకేసారి పలువురు అస్వస్థతకు గురవడంతో కలకలం చెలరేగింది. గ్రామీణ మండలం సింగుపురంలో జరిగిన జాతర సందర్భంగా బాదం…

3 hours ago