Political News

Chandra Babu: జమిలి ఎన్నికలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు… ఏపీలో సాధ్యమేనా?

Chandra Babu: వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే విధానంలో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలపై పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా 2027 వ సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలి ఎన్నికలను నిర్వహించాలని ఇందుకు సంబంధించిన బిల్లుకు త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాలలో కూడా ఆమోదం తెలుపబోతున్నారని తెలుస్తోంది.

ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లను చేస్తుంది. ఇక ఈ ఎన్నికలకు మద్దతుగా ఎన్డీఏ కూటమి సభ్యులు కూడా నిలిచారు ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఎన్డీఏ కూటమిలో సభ్యులు కావడంతో జమిలి ఎన్నికలకు ఈయన కూడా సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది.

గతంలో జమిలి ఎన్నికలకు తాము కూడా అనుకూలమే అని ప్రకటించిన చంద్రబాబు నాయుడు తాజాగా మరోసారి ఈ ఎన్నికల విధానంపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరిగిన ఏపీలో మాత్రం ఈ ఎన్నికలు జరగవని తెలిపారు. 2029 ఎన్నికల సమయం పూర్తి అయిన తర్వాతనే ఎన్నికలు జరుగుతాయి తప్ప ముందస్తు ఎన్నికలు అసలు రావని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

Chandra Babu:ముందస్తు ఎన్నికలు లేవు…

ఇలా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగడానికి జమిలి విధానానికి అన్ని రాష్ట్రాలు కట్టబడి ఉన్నప్పటికీ ఏపీలో మాత్రం ముందస్తు ఎన్నికలు జరగవనే విషయాన్ని వెల్లడించడంతో ఒక్కసారిగా ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

‘పసివాడి ప్రాణం’ నటుడు బాబు ఆంటోనీ లైఫ్ ఇలా మారిపోయింది!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…

1 day ago

చూపు లేకపోయినా సంగీతంతో ప్రపంచాన్ని గెలిచిన వైకమ్ విజయలక్ష్మి!

చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…

1 day ago

కురుక్షేత్ర యుద్ధానికి దూరంగా నిలిచిన మహా యోధులు వీరే..!

మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…

1 day ago

కొత్త దంపతులు ముత్యాలు ధరిస్తే ఇంత మార్పా..? ముత్యాలపై నిపుణుల విశ్వాసం ఇదే!

భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…

1 day ago

ఒకే రాశి వాళ్లు పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది..? తెలుసుకుంటే ఆశ్చర్యమే!

వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…

1 day ago

ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలు అంటున్న వాస్తు నిపుణులు.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందట!

హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…

1 day ago