PF Account: మీరు పీఎఫ్ ఖాతాదారులా.. అయితే ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. అవేంటంటే..మొదట పీఎఫ్ ఖాతా ఉన్న వారికి నెలకు వాళ్లకు వచ్చే బేసిక్ , డీఏ తో కలుకొని.. మొత్తం 12 శాతం వరకు కట్ అవుతుంది. దీనికి కంపెనీ నుంచి కూడా అదే 12 శాతం ఎమౌంట్ ను ఎంప్లాయి షేర్ కింద కొంత శాతం.. పెన్షన్ కింద 3 శాతానికి పైగా ఇస్తుంది.

దీనిలో పెన్షన్ అమౌంట్ తీసుకోవాలంటే.. ఆ కంపెనీకి రిజైన్ చేసిన తర్వాతనే తీసుకుంటారు. ఇక పీఎఫ్ ఉన్నవాళ్లు కింద చెప్పే కొన్ని విషయాలను తెలుసుకోవాలి. అవేంటంటే.. జాబ్ కు రాజీనామ చేసిన తర్వాత.. అందులో ఎలాంటి లావాదేవీలు జరగకపోతే అది ఇన్ యాక్టీవ్ అయిపోతుంది.

దీనిని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలి. అకౌంట్ హోల్డర్ మరణిస్తే.. ఆ అకౌంట్ ఇన్ యాక్టీవ్ అయిపోతుంది. మరణించిన కొన్ని రోజుల తర్వాత అందులోని అమౌంట్ నామినీ తీసుకునే అవకాశం ఉంటుంది.
అలా చేస్తే.. ఆ అమౌంట్ రాదు..
ఇక ఏడేళ్ల కాలంలో అందులో ఎలాంటి క్లెయిమ్ జరగకపోతే.. ఆ మొత్తం అమౌంట్ అనేది .. సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ ఫండ్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినప్పుడు.. పీఎఫ్ ఖాతా నుంచి మొత్తం డబ్బులను విత్ డ్రా చేసుకున్నా కూడా ఖాతా ఇన్ యాక్టివ్ అవుతుంది. నామీనీ వివరాలను కచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నామినీ వివరాలు ఎంటర్ చేయకపోతే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక అన్నింటికంటే ఉపయోగకరమైన విషయం ఎంటంటే.. పీఎఫ్ ఖాతాలో ఉన్న ఎంప్లాయ్ షేర్.. ఎంప్లాయీ షేర్.. పెన్షన్ అమౌంట్ మొత్తం తీసుకోవాలంటే.. సదరు కంపెనీలో జాబ్ రిజైన్ చేసిన మూడు నెలల తర్వాతనే తీసుకోవాలి.. దీని కంటే ముందు తీసుకుంటే.. అంత అమౌంట్ రాదు.




























