Balagam Actor: జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన మొట్టమొదటి చిత్రం బలగం. ఈ సినిమా ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో నటించిన నటినటులకు కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.ఇక ఈ సినిమాలో కేవలం నల్లి బొక్క కోసం అత్తవారింటితో గొడవ పడి అల్లుడి పాత్రలో నటించారు నటుడు మురళీధర్ గౌడ్.
ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మురళీధర్ గౌడ్ తన కన్నీటి కష్టాల గురించి తెలియజేశారు. తన తల్లిదండ్రులకు ఐదుగురు సంతానమని నలుగురు అన్నదమ్ములు, ఒక కుమార్తె సంతానమని తెలిపారు నాన్న కుటుంబ పోషణ కోసం చాలా దూరం వెళ్లి పనులు చేసుకొనీ వచ్చేవారు.
ఇలా నాన్న సంపాదనతో కుటుంబ పోషణ చాలా భారంగా మారిందని ఏదైనా అవసరమైతే కనీసం చేతిలో పది రూపాయలు కూడా లేని దుర్భర పరిస్థితులలో తాము బ్రతికామని తెలిపారు. ఇక చిన్నప్పుడు వేసుకోవడానికి సరైన బట్టలు కూడా ఉండేది కాదని, చిరిగిపోయిన బట్టలు వేసుకుని తిరిగే వాడిని అంటూ ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు.ఇలా చిరిగిన చొక్కా వేసుకుని తిరుగుతూ ఉంటే తన స్నేహితుడు తనని ఎగతాళి చేసే వారని ఇప్పటికీ ఆ కష్టాలు అవమానాలు కళ్ళ ముందు కనపడుతూనే ఉంటాయని తెలిపారు.
ఇక తాను చదివి ఎలక్ట్రిసిటీ బోర్డులో 27 సంవత్సరాల పాటు పని చేశానని తెలిపారు. ఇలా తనకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినప్పటికీ తన కష్టాలు మాత్రం తీరలేదని తెలియజేశారు.27 సంవత్సరాల తర్వాత రిటైర్ అయితే కనీసం చేతిలో రూపాయి లేదని తన బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అని ఈ సందర్భంగా ఈయన తన కష్టాల గురించి చెబుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…