Balakrishna: బాలకృష్ణ అంటే ఆయనకు చాలా కోపం ఎక్కువ, ఆయన తొందరగా అభిమానులపై చేయి చేసుకుంటారని అందరూ అనుకుంటారు. కానీ అది పూర్తిగా తప్పని ఎన్నోసార్లు ఈయన నిరూపించారు. బాలకృష్ణ మనసు చాలా మంచిదని ఆయన మనస్తత్వం ఎంతో సున్నితంగా ఉంటుందని బాలయ్య ఎన్నోసార్లు ఈ విషయాన్ని నిరూపించారు. ఇకపోతే తాజాగా బాలకృష్ణ తన నియోజకవర్గం హిందూపూర్ లో పర్యటించారు.
ఈ క్రమంలోనే తన నియోజకవర్గంలోని ప్రజలు ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఏకంగా ఈయన ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం అనే కార్యక్రమం ద్వారా మొబైల్ వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఈ మొబైల్ వాహనం ద్వారా దాదాపు 200 రకాల వైద్య నిర్ధారణ పరీక్షలు ఉచిత నిర్వహించి మందులను కూడా ఉచితంగా ప్రజలకు సరఫరా చేయనున్నారు. ఈ క్రమంలోనే తన భార్య వసుంధరతో కలిసి ఈ ఆరోగ్య రథ వాహనాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమం అనంతరం బాలకృష్ణ హిందూపురంలోనే తన అభిమాని ఇంటికి వెళ్లి ఒక్కసారిగా ఆయనను సర్ప్రైజ్ చేశారు. ఇలా స్వయంగా అభిమాని ఇంటికి వెళ్లారంటే అతను టిడిపి నేతనో లేకుంటే బాలకృష్ణ అభిమాన సంఘాల నేత మాత్రం కాదు. ఒక సాధారణ బాలకృష్ణ అభిమాని మాత్రమే.ఇలా బాలకృష్ణ ఒక సాధారణ అభిమాని ఇంటికి తన హోదా పరపతి పక్కన పెట్టి ఆయన ఇంటికి వెళ్లి తనని సర్ప్రైజ్ చేశారు.
ఈ విధంగా బాలకృష్ణ ఆ ఇంటికి వెళ్లడానికి ఓ కారణముంది.బాలకృష్ణ హిందూపురంలో పర్యటించిన రోజు తన అభిమాని పుట్టినరోజు అని తెలుసుకోవడంతో బాలయ్య స్వయంగా ఆ ఇంటికి వెళ్లి తన అభిమానిని ఆశీర్వదించి తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇలా బాలకృష్ణ స్వయంగా తన ఇంటికి వెళ్లి తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడంతో అసలు సిసలైన పుట్టినరోజు ఈరోజు అంటూ అభిమాని ఎమోషనల్ అవుతూ బాలకృష్ణకు శాలువా కప్పి సత్కరించారు.ఇక ఇది తెలిసిన అభిమానులు ఇదే కదా బాలయ్య అంటే అంటూ పెద్ద ఎత్తున అభిమాన హీరో పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…
దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో దగ్గు సిరప్ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందులు లేదా…
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష చుట్టూ గత కొంతకాలంగా వివాదాలు, పేపర్ లీక్…