ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం పూట పండ్లు తినడం మంచిదనే అభిప్రాయం చాలామందిలో ఉంది. అయితే అన్ని రకాల పండ్లు ఖాళీ కడుపుతో తినడానికి సరిపోవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని పండ్లు జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపి ఎసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు కారణమవుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయాన్నే కడుపు ఖాళీగా ఉన్న సమయంలో ఏం తింటున్నామన్నది చాలా ముఖ్యం అంటున్నారు వైద్యులు.
పుల్లటి రుచితో ఉండే నారింజ, మోసంబి, అనాస వంటి సిట్రస్ పండ్లలో యాసిడ్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే కడుపులో మంట, ఎసిడిటీ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
అరటిపండు కూడా చాలామంది ఉదయం మొదటగా తింటుంటారు. అయితే ఇందులో సహజ చక్కెరలు, మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల కొందరిలో బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరగవచ్చని చెబుతున్నారు. ఖాళీ కడుపుతో అరటిపండు తింటే అలసట లేదా కడుపు భారంగా అనిపించే అవకాశమూ ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
వేసవిలో ఎక్కువగా తినే పుచ్చకాయ, కర్బూజ వంటి పండ్లను కూడా పరిమితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ ఖాళీ కడుపుతో ఎక్కువగా తింటే జీర్ణక్రియ మందగించి కడుపు ఉబ్బరం వచ్చే ప్రమాదం ఉందంటున్నారు.
అలాగే మామిడి, సీతాఫలం, చీకూ వంటి తీపి పండ్లలో సహజ చక్కెరలు అధికంగా ఉంటాయి. ఇవి ఉదయం నేరుగా తీసుకుంటే ఇన్సులిన్ స్థాయిలపై ప్రభావం పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ఉదయం సమయంలో బొప్పాయి, యాపిల్ వంటి తేలికగా జీర్ణమయ్యే పండ్లు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పండ్లు తినే ముందు గోరువెచ్చని నీరు లేదా నానబెట్టిన బాదం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందని చెబుతున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’పై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. దర్శకుడు బుచ్చి…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘కరుప్పు’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ఈ సినిమాను…
వరంగల్ నగరంలో చైన్ స్నాచింగ్ ఘటనలు వరుసగా చోటుచేసుకుంటుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. సాధారణంగా ఒంటరి మహిళలే లక్ష్యంగా…
ప్రస్తుతం జీవనశైలి మార్పులు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వల్ల హై కొలెస్ట్రాల్ సమస్య వేగంగా పెరుగుతోంది. చాలా…
వేసవి కాలం వచ్చిందంటే చాలు చెమట, ఉక్కపోత, చర్మ సమస్యలు వెంటాడటం సాధారణమే. ముఖ్యంగా ఇటీవల ఫంగల్ ఇన్ఫెక్షన్ల కేసులు…
ఇటీవలి కాలంలో బ్లాక్ కలర్ వాటర్ బాటిళ్ల వినియోగం యువతలో ట్రెండ్గా మారింది. జిమ్లు, ఆఫీసులు, ట్రావెలింగ్లో స్టైలిష్గా కనిపిస్తాయని…