Featured

మెగాస్టార్ చిరంజీవితో అత్యధిక సినిమాలు రూపొందించిన కోదండరామిరెడ్డి ఒకే ఒక చిత్రంతో విభేదించాల్సివచ్చింది.?!

మెగాస్టార్ చిరంజీవి కోదండరామిరెడ్డి కాంబినేషన్లో దాదాపు ఇరవై మూడు చిత్రాలు రూపొందించబడ్డాయి. అలాగే బాక్సాఫీస్ వద్ద అనేక చిత్రాలు విజయవంతం అయ్యాయి కూడా.. ధనుంజయరెడ్డి, నిరంజన్ రెడ్డి నిర్మాతలుగా ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన “ఖైదీ” చిత్రం చిరంజీవి సినీ చరిత్రలో ఒక టర్నింగ్ పాయింట్ గా చెప్పవచ్చు. అలాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఈ నిర్మాతలు చిరంజీవితో మరొక చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చారు. హీరోగా చిరంజీవిని, దర్శకుడిగా ఏ.కోదండరామిరెడ్డిని ఎంపిక చేసుకున్నారు. ఆ క్రమంలో వారు ఒక విజయవంతమైన సినిమాను రూపొందించాలనుకున్నారు. తిరిగి స్టోరీ బాధ్యతలను పరుచూరి బ్రదర్స్ కి అప్పగించడం జరిగింది.

ఈసారి బ్రిటిష్ కాలం నాటి కథతో పరుచూరి బ్రదర్స్ ముందుకు వచ్చారు. ఆ కథ.. 1930 వ దశకంలో ప్రతాప్(చిరంజీవి) ఒక ఓడలో పని చేస్తుంటాడు. అతను ఉన్నత వర్గానికి చెందిన సరోజతో (జయప్రద) ప్రేమలో పడతాడు. అతను పనిచేసే ఓడలో చౌడప్ప(నూతన్ ప్రసాద్) అనేవ్యక్తి కెప్టెన్ కావాలనే దురుద్దేశంతో ఓడ కెప్టెన్ ను విషాహారం ఇచ్చి చంపేస్తాడు. ఓడ కెప్టెన్ ప్రతాప్ ని పిలిచి అతన్ని కెప్టెన్ గా ఉండమని చెప్పి మరణిస్తాడు. జరిగిన విషయం తెలుసుకున్న ప్రతాప్ చౌడప్పను, అతనికి సహకరించిన వ్యక్తిని చట్టానికి అప్పగిస్తాడు. కానీ తాను పెళ్ళిచేసుకోబోయే సరోజను ప్రేమించాడనే కక్షతో జయరాం (మోహన్ శర్మ) అనే జమీందారు కెప్టెన్ హత్యను ప్రతాప్ మీదకు తోసి అతన్ని అండమాన్ జైలుకు పంపించి వేస్తాడు.

ప్రతాప్ కి ఆ జైల్లో తనలాగే శిక్షననుభవిస్తున్న మహేంద్రభూపతితో(జగ్గయ్య) పరిచయం ఏర్పడుతుంది. ఆయన కూడా జయరాం చేతిలో మోసపోయి ఉంటాడు. మహేంద్రభూపతి చనిపోతూ ప్రతాప్ కు ఒక దట్టమైన అడవిలో తాను దాచిన సిరిసంపదలుండే చోటు చెప్పి మరణిస్తాడు. భూపతి స్థానంలో ప్రతాప్ మరణించిన వాడిగా ఒక గోనెసంచిలో చేరి ఆ జైలు నుంచి తప్పించుకుంటాడు. ఈ కథ పూర్తయిన తర్వాత ఖైదీ నిర్మాతల కోరిక మేరకు చిరంజీవి, పరుచూరి బ్రదర్స్, కోదండరామిరెడ్డి కలిసి స్టొరీ డిస్కషన్ లో పాల్గొన్నారు.

పరుచూరి బ్రదర్స్ చెప్పిన కథ బాగున్నప్పటికీ కథలో చివరికి హీరోయిన్ విలన్ ని పెళ్లి చేసుకుని ఓ కొడుకుని కన్నా కూడా హీరో, హీరోయిన్ వెంబడి తిరగడం లాంటివి కోదండరామిరెడ్డికి నచ్చలేదు. ప్రేక్షకులు ఇలాంటి ముగింపును ఇష్టపడరని కోదండరామిరెడ్డి చెప్పిన కూడా..నిర్మాతలు పట్టుపట్టడంతో కోదండరామిరెడ్డి చేసేదిలేక “వేట”చిత్రం ఎలాగో అలాగా పూర్తి చేసి 1986 మే 28 విడుదల చేయడం జరిగింది.చక్రవర్తి స్వరపరిచిన “ఊరేమిటమ్మ..పేరేమిటమ్మ.. నువ్వెవరు..” అలాగే జేసుదాసు ఆలపించిన “ఓ లేడీ కూనా.. ఈ వేటలోనా”..అనే పాటలు ప్రేక్షకాదరణ పొందినప్పటికీ. వేట చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం మూటకట్టుకుంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

1 day ago

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకకు ముప్పు తెస్తున్న కొత్త జీవనశైలి ఇదే!

ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…

1 day ago

మధుమేహం, గుండె జబ్బులు లేకుండా పిల్లలు పుడతారా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది!

వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…

1 day ago

కరివేపాకుతో బరువు తగ్గొచ్చా? రోజూ ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…

1 day ago

83 ఏళ్ల వయసులోనూ అదే కసి.. ఒక సీన్ కోసం నిద్ర మానేసిన అమితాబ్ బచ్చన్!

సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…

1 day ago

పీరియడ్స్ సమయంలో యోగా చేయొచ్చా? అపోహలు పక్కన పెట్టండి.. నిపుణులు చెబుతున్న నిజాలు ఇవే!

నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…

1 day ago